షాకింగ్: ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు.. ప్రభుత్వాలకు వారథిలా.. మరీ ముఖ్యంగా ప్రజలను నిత్యం చైతన్యపరుస్తుండే పాత్రికేయులను కూడా ఈ వైరస్ వదలట్లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు.. పలు ప్రాంతాల్లో విధుల్లో ఉన్న పోలీసులకు, అలుపెరగని విధంగా ప్రాణాలకు తెగించి మరీ వైద్యం అందిస్తున్న డాక్టర్స్.. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది‌నీ కరోనా వదలట్లేదు. తాజాగా ముంబైలోను పాత్రికేయులుగా పనిచేస్తున్న 53 మందికి కరోనా వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. అయితే వీరిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో అసలేం జరిగి ఉంటుందని తోటి పాత్రికేయులు.. ఆయా మీడియా సంస్థలు అలెర్ట్ అయ్యాయి. ఇవాళ మొత్తం 170 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా 53 మందికి కరోనా అని వైద్యులు తేల్చారు.

ఎలా వచ్చింది!?

ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో మొదట్నుంచే కేసులు ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 16వేలకు పైగా కరోనా కేసులుంటే.. మరణాలు సైతం అలానే ఉన్నాయి. తాజాగా.. ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఎక్కడికంటే అక్కడికి కవరేజింగ్‌కు వెళ్లిన 52 మీడియా ప్రతినిధులకు కరోనా రావడం.. అసలు వారికి ఎక్కడ్నుంచి వచ్చింది..? ఎలా వచ్చిందనే దానిపై అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులు కోవిడ్ బారిన పడినట్లు సమాచారం. ముగ్గురు జర్నలిస్టులకు కరోనా సోకినట్లు తేలడంతో.. చెన్నైలోని మిగతా జర్నలిస్టులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

జర్నలిస్ట్ గిల్డ్..

జర్నలిస్టులకు కూడా కరోనా సోకడం ప్రారంభించడంతో బయట రిపోర్టింగ్ వెళ్లేవాళ్లకు కరోనా లక్షణాలు కనిపిస్తే రెస్ట్ తీసుకోవాలని.. వారిని అన్ని విధాలా మీడియా సంస్థల యాజమాన్యాలు ఆదుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కోరుతోంది.

More News

ఇక‌పై డ‌బ్బింగ్ సినిమాల‌కు ఇబ్బందేనా..!

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా స్తంభించింది. ప‌లు దేశాలు కోవిడ్ 19 నుండి బారి నుండి త‌ప్పించుకోవ‌డానికి లాక్‌డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి.

'వ‌కీల్‌సాబ్' కోసం ప‌వ‌న్ ప‌డ్డ క‌ష్టం

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు.

చంద్రబాబుకు చిరు బర్త్ డే విషెస్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు.

సినీ కార్మికుల ఆ పని చేయ‌డానికి కూడా సిద్ధ‌మేనంటున్న మెగాస్టార్‌

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతటా లాక్ క్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు

'పుష్ప'లో బ‌న్నీ స‌ర్‌ప్రైజ్ ఇదేనా..?

టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా చిత్రంగా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే