జగన్, మంత్రులపై షాకింగ్ న్యూస్ వెలుగులోకి..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎంగా వైఎస్ జగన్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్తో పాటు ఆయన కేబినెట్లోని మంత్రుల గురించి ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, జనాలు ఒకింత కంగుతిన్నారట. ఆ షాకింగ్ విషయమేంటో ఇప్పుడు చూద్దాం.
అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక బుధవారం నాడు ఓ షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఏపీ కేబినెట్లో అందరికంటే వైఎస్ జగన్ అత్యంత సంపన్నుడని.. ఆయన సంపద విలువ ఏకంగా రూ.510 కోట్లు అని తేల్చింది. అంతేకాదు.. కేబినెట్లోని 26 మంది మంత్రుల్లో 23 మంది కోటీశ్వరులేనని షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఈ 26 మంది సంపద విలువ సగటున రూ.35.25 కోట్లుగా ఉందట.
ఎవరి స్థానమేది..!?
మొదటి స్థానంలో వైఎస్ జగన్.. సంపద విలువ రూ.510 కోట్లు
రెండో స్ధానంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. సంపద విలువ రూ.130 కోట్లు.
మూడో స్థానంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. సంపద విలువ రూ.61 కోట్లు.
మంత్రివర్గంలోని 26 మంది మంత్రుల్లో ముగ్గురి వార్షిక ఆదాయం రూ.కోటి పైమాటేనట.
35 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ ఓ ప్రకటనలో తేల్చింది.
కాగా.. ఈ ప్రకటనపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతుండగా.. కార్యకర్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సైతం వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ టీడీపీ బాగోతాలు సైతం బయటపెడుతున్నారు. అయితే వైసీపీ పెద్దలు, మంత్రులు ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.