close
Choose your channels

నివేదా పేతురాజ్ ఊహించని షాక్.. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే..

Thursday, June 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నివేదా పేతురాజ్ ఊహించని షాక్.. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే..

ఇష్టమైన ఫుడ్ తినడం ఇప్పుడు చాలా తేలిక. ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో మీరు కోరుకున్న ఫుడ్ మీ ముందు ఉంటుంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ ఈ రోజుల్లో ఆన్లైన్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. అయితే కొన్ని సార్లు ఫుడ్ డెలివరీ సంస్థలు, హోటల్స్ నుంచి కస్టమర్స్ కి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

ఇదీ చదవండి: ప్రకాష్ రాజ్ టీం రెడీ.. అనసూయ, సుడిగాలి సుధీర్, బండ్ల గణేష్..

తాజాగా ఇలాంటి చేదు అనుభవం అందాల తార నివేదా పేతురాజ్ కి ఎదురైంది. నివేదా పేతురాజ్ ఇటీవల స్విగ్గీలో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలివరీ అందుకున్నాక తిందామని నివేదా ప్యాక్ ఓపెన్ చేసింది. అంతే.. నివేదాకు ఊహించని షాక్. ఫ్రైడ్ రైస్ లో బొద్దింక కనిపించింది.

దీనితో నివేదా హోటల్ యాజమాన్యంతో పాటు ఫుడ్ డెలివరీ సంస్థపై కూడా మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇటీవల కాలంలో హోటల్స్ సరిగ్గా శుభ్రత పాటించడం లేదు అనేందుకు ఇదొక ఉదాహరణ. నేను ఆర్డర్ చేసిన ఫుడ్ లో బొద్దింక వచ్చింది. హోటల్ వాళ్ళు నాణ్యత పాటించకపోగా.. కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని భారీగా జరిమానా విధించాలి' అని నివేదా ఆగ్రహం వ్యక్తం చేసింది.

నివేదా పోస్ట్ కు స్విగ్గీ ఇండియా స్పందించింది. తప్పనిసరిగా హోటల్ పై చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చింది. నివేదా పేతురాజ్ తెలుగులో చిత్రలహరి, అల వైకుంఠపురములో, రెడ్ చిత్రాలతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం నివేదా విరాటపర్వం, పాగల్ చిత్రాల్లో నటిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.