close
Choose your channels

లెక్క తేల్చేస్తున్న శ్రియా శ‌ర‌న్‌

Wednesday, November 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లెక్క తేల్చేస్తున్న శ్రియా శ‌ర‌న్‌

శ్రియా శ‌ర‌న్ లెక్క స‌రిచేస్తుందా? అంటే అవుననే సమాధానం విన‌ప‌డుతుంది. ఇంత‌కు శ్రియ ఏ విష‌యంలో లెక్క స‌రిచేస్తుందనే వివరాల్లోకెళ్తే.. గ‌తంలో వెంక‌టేశ్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్రారంభ‌మైంది. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమాలో వెంకీ జ‌త‌గా శ్రియాశ‌ర‌న్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు.

అయితే ఆ సినిమా ఆగిపోవ‌డం, అదే స‌మ‌యంలో శ్రియా శ‌రన్ పెళ్లి చేసుకోవ‌డం వంటి కార‌ణాలతో వెంకీ, శ్రియ జోడి మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం రాలేదు. అయితే ఆ సినిమా మేకింగ్ స‌మ‌యంలో శ్రియ‌కు నిర్మాత సురేష్‌బాబు అడ్వాన్స్ ఇచ్చాడు. దాన్ని తిరిగి తీసుకోలేదు. ఇప్పుడు ఆ అడ్వాన్స్ స్థానంలో శ్రియ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైంద‌ని టాక్‌. ఎలాగంటే.. వెంక‌టేశ్ హీరోగా త‌మిళ చిత్రం `అసుర‌న్‌`ను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఇందులో వెంక‌టేశ్ హీరోగా న‌టించ‌బోతున్నారు. కాగా హీరోయిన్ మంజు వారియ‌ర్ స్థానంలో శ్రియాశ‌ర‌న్‌ను తీసుకోబోతున్నార‌ట‌.

ధ‌నుష్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన `అసుర‌న్‌`ను త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగు రీమేక్‌ను క‌లైపులిథాను, డి.సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాక సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అలాగే ప్ర‌స్తుతం వెంక‌టేశ్, చైత‌న్య‌తో క‌లిసి `వెంకీమామ‌` సినిమాలో న‌టించాడు. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.