పెళ్ళి గురించి ఎందుకమ్మా? బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి హాసన్ లాక్‌డౌన్‌‌‌

  • IndiaGlitz, [Wednesday,April 21 2021]

పెళ్ళి గురించి అడిగితే శ్రుతి హాసన్ కస్సుబస్సులాడుతుంది. 'ఎందుకు? పెళ్ళి గురించి ఇప్పుడు ఎందుకమ్మా?' అంటుంది. ఓ అడుగు ముందుకు వేసి పెళ్ళి ప్రశ్న వేసినోళ్లను 'మీ పెళ్ళి ఎప్పుడు? ముందు అది చెప్పండి?' అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచన లేదన్నట్టు వ్యవహరిస్తోంది.

'సలార్' హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ముంబయ్ వెళ్ళింది శ్రుతి. బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజారికాతో ఫ్లాట్‌లో ఉంటుంది. ముంబ‌య్‌లో లాక్‌డౌన్‌ కనుక ఎటు వెళ్ళకుండా బుద్దిగా ఇంట్లో ఉంటున్నార్ట‌. బాయ్‌ఫ్రెండ్‌తో ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ఓ వ‌య‌సు వ‌చ్చిన హీరోయిన్ల‌కు ప్రేక్ష‌ల‌కుల నుంచి పెళ్ళికి సంబంధించిన ప్ర‌శ్న‌లు త‌ప్పడం లేదు. సోష‌ల్ మీడియా లైవ్‌లోకి రావ‌డమే ఆల‌స్యం 'పెళ్ళెప్ప‌డమ్మా' అని అడుగుతున్నారు. శ్రుతి హాసన్‌కి సైతం ఈ సమస్య తప్పలేదు. గతంలో లండన్ యాక్టర్ మైఖేల్ తో కొన్నాళ్ళు డేటింగ్ లో ఉన్నారు శ్రుతి. తర్వాత  బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు శాంతనుతో డేటింగ్ లో ఉన్నారు.

More News

పవన్ చేతిపై టాటూ.. అసలు సీక్రెట్ ఇదేనట..

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు.

షూటింగ్‌లపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆంక్షలు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున సినిమా షూటింగ్‌లపై కూడా ఆంక్షలు విధిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.

సినీ పరిశ్రమ, జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు.

4 రాష్ట్రాల సీఎంలు సహా కరోనాకు చిక్కిన బడా నేతలు

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతోంది.

తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్..

తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్ కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న క్రమంలో తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.