శ్రుతిది మ‌ళ్లీ అదే తంతు

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది శ్రుతి హాస‌న్‌. 'ఎవ‌డు', 'రేసు గుర్రం', 'శ్రీమంతుడు'.. ఇలా పెద్ద హీరోల‌తో శ్రుతి హీరోయిన్‌గా చేసిన మూడు వ‌రుస సినిమాలు ఆమెకు విజ‌యాన్ని అందించాయి. ఈ నేప‌థ్యంలో కూడా శ్రుతి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికైతే ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు చిత్రం 'ప్రేమ‌మ్' మాత్ర‌మే. నాగ‌చైత‌న్య ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా జులైలో విడుద‌ల‌వుతుంది.

2014లో 2 స్ట్ర‌యిట్ చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన శ్రుతి.. గ‌తేడాది 'శ్రీమంతుడు'తో మాత్ర‌మే స‌రిపెట్టింది. ఈ ఏడాది కూడా ఆమెది అదే తంతు. కేవ‌లం 'ప్రేమ‌మ్' మాత్ర‌మే ఆమె హీరోయిన్‌గా న‌టించ‌గా వ‌స్తున్న తెలుగు చిత్రం. ఇత‌ర భాషా చిత్రాల‌తో బిజీగా ఉండ‌డ‌మే శ్రుతి నుంచి త‌క్కువ సినిమాలు రావ‌డానికి కార‌ణ‌మ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.

ఏదేమైనా మ‌రీ అగ్ర హీరోల మాదిరిగా హీరోయిన్‌లు కూడా ఏడాదికో సినిమా అంటే క‌ష్ట‌మే. శ్రుతి ఈ విష‌యంలో ఆలోచిస్తే ఆమె కెరీర్‌కే మంచిది. ఎందుకంటే.. తెలుగులో ఉన్న‌ట్లుగా ఆమెకి మ‌రెక్క‌డా ఇంత‌టి స‌క్సెస్ గ్రాఫ్ లేదు మ‌రి.

More News

రైట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అ ఆ టీజ‌ర్ రిలీజ్..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అ ఆ. అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనంద‌విహారి అనేది ట్యాగ్ లైన్.  ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

నాగశౌర్య అవుట్...

ప్రస్తుతం యంగ్ హీరోస్ లో నాగశౌర్యకు మంచి క్రేజ్ ఉంది. అయితే నాగశౌర్య ఆ క్రేజ్ ను సక్సెస్ రూపంలో మలుచుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ వైభోగమే సినిమా మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది.

12 ఏళ్ల తరువాత మహేష్

మొత్తానికి మహేష్ బాబు కొత్త చిత్రం 'బ్రహ్మోత్సవం' మే నెలలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

జీవితం అంటే అంతే..ఎప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చెప్పలేం. - పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్నియువ దర్శకుడు బాబీ తెరకెక్కించారు.పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.