close
Choose your channels

త్రిశూలాల మధ్యలో నాని.. 'శ్యామ్ సింగ రాయ్' ఫైనల్ షెడ్యూల్

Thursday, July 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్రిశూలాల మధ్యలో నాని.. శ్యామ్ సింగ రాయ్ ఫైనల్ షెడ్యూల్

నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. థియేటర్లు తెరుచుకోగానే ఆ చిత్రం రిలీజ్ కానుంది. ఈ లోపు నాని మరో క్రేజీ చిత్రాన్ని కూడా ఫినిష్ చేయనున్నాడు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని 'శ్యామ్ సింగ రాయ్' లో నటిస్తున్నాడు.

బలమైన కథ, భారీ బడ్జెట్ తో రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హైదరాబాద్ లో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాతలు ఓ సెట్ నిర్మించారు. కీలక సన్నివేశాలు ఈ సెట్ లో ఉండబోతున్నాయి. ఆ మధ్యన వర్షాలకు సెట్ దెబ్బతినింది. మరమ్మతులు చేసి ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ ని అదే సెట్ లో షూట్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: దుబ్బాకలో హృదయ విదారక ఘటన.. ఆపద్భాంధవుడైన సంపూర్ణేష్ బాబు

10 ఎకరాల విస్తీరణంలో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో ఈ సెట్ నిర్మించారు. నేడు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం కావడంతో చిత్ర యూనిట్ నాని ఇంట్రెస్టింగ్ స్టిల్ రిలీజ్ చేసింది. ఈ స్టిల్ లో నాని త్రిశూలాల మధ్య ఉండడం ఆసక్తికరంగా ఉంది.

ఈ చిత్రం కోల్ కతా నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ మూవీ లో నాని వివిధ గెటప్పుల్లో కనిపించబోతున్నట్లు టాక్. నాని సరసన హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటిస్తున్నారు.

మిక్కిజె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.