బెజవాడ కనకదుర్గమ్మ రథంలోని 3 వెండి సింహాలు మాయం

  • IndiaGlitz, [Wednesday,September 16 2020]

ఏపీ దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటన ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకు ముందే.. విజయవాడ కనకదుర్గమ్మ వెండి రథంలోని నాలుగు సింహాల్లో ఏకంగా మూడు సింహాలు మాయమవడం కలకలం రేపుతోంది. దుర్గమ్మకు మూడు రథాలున్నాయి. వాటిలో ఈ వెండి రథం ఒకటి. శ్రీదుర్గామల్లేశ్వరులను ప్రతి ఉగాదికి ఈ రథంపైనే ఊరేగిస్తారు.

అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించలేదు. గతేడాది ఉగాదికి ఆది దంపతుల ఊరేగింపు పూర్తైన అనంతరం వెండి రథాన్ని మహామండపం ముందు నిలిపి.. టార్పాలిన్ కప్పేశారు. ఆ తరువాత ఆ వెండి రథం వైపు చూసిన నాథుడే లేకుండా పోయాడు. ఇటీవల అంతర్వేది ఘటన అనంతరం దుర్గ గుడిలోని రథాల భద్రత గురించి విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సోమవారం దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబుతో చర్చించారు. పలు సూచనలు చేసిన అనంతరం వెండి రథాన్ని పరిశీలించేందుకు టార్పాలిన్ కవర్‌ తీయగా.. మూడు సింహాలు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. కనీసం సింహాల చోరీ ఎప్పుడు జరిగిందనే విషయం కూడా అధికారులకు తెలియకపోవడం విస్మయం కలిగిస్తోంది. కరోనా లాక్‌డన్ కారణంగా దర్శనాలు కూడా లేవు. దీనినే దొంగలు అవకాశం తీసుకుని ఉంటారని తెలుస్తోంది. ఆలయ అధికారులు మాత్రం దీనిపై గోప్యత పాటిస్తున్నారు. వెండి రథంపై సింహాలు చోరీకి గురైందీ లేనిది తేలడానికి మూడు రోజులు పడుతుందని ఈవో సురేష్‌బాబు మీడియాకు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

More News

బిగ్‌బాస్ హౌస్‌లో బిర్యానీని చూడనట్లు బిహేవ్ చేస్తారు: సూర్యకిరణ్

బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సూర్యకిరణ్ ఓ ఇంటర్వ్యూలో హౌస్ గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు.

శ‌ర్వానంద్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌...?

డైరెక్ట‌ర్‌గా తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ర‌వితేజ‌, సిద్ధార్థ్ స‌హా

తండ్రి త‌ర్వాత కొడుకుతో ప‌నిచేయ‌నున్న మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి స్పీడుపెంచాడు. ప్ర‌స్తుతం `ఆచార్య` సినిమాను ఆయ‌న పూర్తి చేయాల్సి ఉంది. దీని త‌ర్వాత మ‌రో నాలుగైదు క‌థ‌ల‌తో ద‌ర్శ‌కులు సిద్ధంగా ఉన్నారు.

అనుష్క 'నిశ్శ‌బ్దం' ఓటీలో ఎప్ప‌టినుండంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా కనపడటమే కాదు.. అవకాశాలను అందిపుచ్చుకుని

బ‌న్నీ ఫ్యాన్స్‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇస్తానంటున్న త‌మ‌న్

మ్యూజికల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆఫ్ టాలీవుడ్‌. ఈ ఏడాది విడుద‌లైన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి త‌మ‌న్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది.