close
Choose your channels

విశాల్‌ పై కోర్టుకెక్కిన శింబు

Thursday, January 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాల్‌ పై కోర్టుకెక్కిన శింబు

తమిళ హీరో శింబు గతంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'ఎఎఎ' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. శింబు జోక్యం వల్లే తాను నష్టపోయానని నిర్మాత వైుకేల్ రాయుప్పన్ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. అందువల్ల నిర్మాతల మండలి వివరణ కోరుతూ శింబుకు నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో శింబు నిర్మాతల మండలినిపై, నిర్మాత వైుకేల్ రాయుప్పన్‌పై కోర్టులో కేసు వేశారు. తనకు పారితోషకంగా 8 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఐదు కోట్లే ఇచ్చారని.. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని శింబు పేర్కొన్నారు.

వాదనలు విన్న కోర్టు వైుకేల్ రాయుప్పన్‌ను పిటిషన్ వేయాల్సిందిగా కోరడమే కాకుండా.. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు లీగల్ నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 18కి వాయిదా వేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.