కరోనాను జయించిన కనికా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

  • IndiaGlitz, [Monday,April 06 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకుంది. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన ఆమె ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా నాలుగుసార్లు టెస్ట్‌లు చేసినప్పటికీ ఆమెకు నెగిటివ్ రావడంతో అసలేం జరుగుతోందో అర్థం కానిపరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఐదోసారి టెస్ట్ చేయగా నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా సోమవారం నాడు మరోసారి టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. దీంతో కనికా కోలుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.

కాగా.. ఇవాళ లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి నుంచి కనికా డిశ్చార్జ్ అయ్యింది. లండన్‌లో పర్యటించి వచ్చిన తర్వాత ఆమెకు కరోనా లక్షణాలుండటంతో ఆస్పత్రికి తరలించి టెస్ట్ చేయగా.. మార్చి 20న పాజిటివ్ అని తేలింది. నాటి నుంచి ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స తీసుకున్న ఆమె తాజాగా డిశ్చార్జ్ అయ్యింది. డిశ్చార్జ్ అయినప్పటికీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. మరోవైపు క్వారంటైన్‌లో ఉండకుండా బయటతిరిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు కనికాను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

More News

కోవిడ్ 19 ప్ర‌భావం.. మురికివాడ‌లో పేద‌ల‌కు ర‌కుల్ సాయం

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో దేశ‌మంతా లాక్ డౌన్ అయ్యింది. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంది. అప్ప‌టి వ‌ర‌కు రోజువారీ కూలీలు, కార్మికుల‌కు చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ప‌వ‌న్ 27లో అనుష్క‌..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న

గ్యాప్‌లో.. ప్ర‌భాస్ 21 ద‌ర్శ‌కుడేం చేస్తున్నాడంటే..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్

'లూసీఫర్' రీమేక్‌ పవన్ చేస్తానంటే.. : చిరు రియాక్షన్ ఇదీ..

మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్రలో న‌టించిన ‘లూసిఫ‌ర్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నాడు.

'ఆచార్య'లో మహేశా.. చెర్రీనా.. క్లారిటీ ఇచ్చేసిన చిరు

టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి.. సూపర్ హిట్ చిత్రాల, సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే సినిమాకు సంబంధించి దాదాపు అన్ని విషయాలు లీకైపోయాయి.