అమితాబ్ సినిమాకి సిరాశ్రీ హిందీ పాట

  • IndiaGlitz, [Friday,May 05 2017]

దక్షిణాది నుంచి హిందీ సినిమాల్లో పనిచేసే నటులుంటారు, సంగీత దర్శకులు ఉంటారు, దర్శకులు ఉంటారు. కానీ గీతరచయితల గురించి ఎప్పుడైనా విన్నామా? తొలిసారిగా తెలుగు సినీగీతరచయిత సిరాశ్రీ బాలీవుడ్ సినిమాకి పాట రాసారు. అది కూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాకి. రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న "సర్కార్-3" చిత్రానికి గాను సిరాశ్రీ "థాంబా.." అంటూ ఒక హిందీ పాట రాయడం జరిగింది.
"మొదటిసారిగా సర్కార్3 కోసం హిందీలో తెలుగు గీతరచయిత సిరాశ్రీ "థాంబా" అనే పాట రాసాడు". అని ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
దీనిపై సిరాశ్రీ స్పందిస్తూ, "తెలుగులో పాటలు రాసుకునే నేను హిందీ సినిమాకు పాట రాస్తానని కలలో కూడా కలగనలేదు. అది కూడా సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ కి రాస్తానని అసలు ఊహలో కూడా ఊహించలేదు.ఆర్జీవి ఇక తెలుగులో సినిమాలు చెయ్యను అన్నారు. అది జరిగితే, ఇక ఆయనకు నాతో గీతరచయితగా జర్నీ ఆగిపోయినట్టే. అది జరగడం ఇష్టం లేదు. అందుకే ఇలా నా నుంచి హిందీపాట తన్నుకొచ్చింది అని నా ఫీలింగ్. "నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్" కదా! ఏళ్లతరబడి చూసిన హిందీ సినిమాలు, విన్న హిందీ పాటలు, కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాంపుల వల్ల పట్టుబడిన కొంత హిందీ, ఆర్జీవీ సాహచర్యం వల్ల పెరిగిన హిందీ మిత్రులు...ఇలా అన్ని విషయాలు నాకు తెలియకుండానే ఉపయోగపడ్డాయి." అని ఫేస్ బుక్కులో పోస్ట్ చేసాడు.
బాహుబలి2 తో రాజమౌళి, దాదాసాహెబ్ ఫాల్కేతో కే విశ్వనాథ్ తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో జెండా ఎగరేస్తున్న తరుణంలో సిరాశ్రీ కూడా బాలీవుడ్డులో దక్షిణాది నుంచి కొత్త రికార్డు తెరవడం తెలుగు వారు గర్వించాల్సిన విషయమే.

More News

మే 6న శర్వానంద్ 'రాధ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `రాధ`.

'బాహుబలి-2' షేర్ వివరాలివే...

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియజేసిన విజువల్ వండర్ 'బాహుబలి 2'.

'ప్రాజెక్ట్ z' మే లో విడుదల

సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్' చిత్రాన్ని 'ప్రాజెక్ట్ z' గా ఎస్బికె ఫిలింస్ కార్పోరేషన్లో ఎస్.కె. బషీద్ సమర్పణలో నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

విలన్ గా శ్రియా శరన్...

హీరోయిన్స్ లో నెగటివ్ షేడ్స్ చేయగల హీరోయిన్స్ వేరయా అనే చందాన..

పీకేను దాటేసిన 'బాహుబలి-2'

విడుదల రోజు కంటే ముందు రోజు నుండి భారీ అంచనాలు మధ్య విడుదలైన విజువల్ గ్రాఫిక్స్ వండర్ 'బాహుబలి-2'