ప్రభాస్ 'ఆదిపురుష్‌'లో సీత ఎవరంటే..?

  • IndiaGlitz, [Saturday,November 28 2020]

తొలి చిత్ర‌మే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం పొందింది కృతి స‌న‌న్‌. మోడ‌లింగ్ నుంచి సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కృతికి ఆ చిత్రం (1 - నేనొక్క‌డినే) పేరు తీసుకువ‌చ్చినా.. విజ‌యాన్నైతే ఇవ్వ‌లేక‌పోయింది. ఆ త‌రువాత వ‌చ్చిన దోచేయ్ కూడా డిజాస్ట‌ర్ కావ‌డంతో తెలుగు తెర‌పై మ‌ళ్లీ క‌నిపించ‌నేలేదు కృతి. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతోందీ అమ్మ‌డు.

లేటెస్ట్ సమాచారం మేరకు కృతిస‌న‌న్‌కు ఓ భారీ చిత్రంలో అవ‌కాశం ద‌క్కింది. అది కూడా ఓ ప్యాన్ ఇండియా మూవీ. ఇలాంటి సినిమా చేస్తే అటు ద‌క్షిణాది, ఇటు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర కావ‌డం ఖాయం కావ‌డంతో కృతి కూడా ఆ సినిమాలో చేయ‌డానికి ఓకే చెప్పేసింద‌ని అంటున్నారు. ఆ సినిమా ఏదో కాదు.. ఆదిపురుష్‌.

ప్ర‌భాస్ హీరోగా, ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుంటే, సైఫ్ అలీఖాన్ రావ‌ణాసురుడిగా న‌టిస్తున్నారు. మ‌రి సీత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై చాలా మంది హీరోయిన్స్ పేర్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి.

అయితే ఇప్పుడు కృతిస‌న‌న్ దాదాపు ఖ‌రారైన‌ట్లేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న ప్ర‌భాస్ ఈ సినిమానే స్టార్ట్ చేస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది.

More News

బాలీవుడ్ కి వెళుతున్న ఎన్టీఆర్ చిత్రం

తెలుగు సినిమాల కంటెంట్ మారుతోంది. డిఫరెంట్ సినిమాలు చూడటానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తుండ‌టంతో మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా అలాంటి సినిమాలు చేయ‌డానికే ఆస‌క్తి చూపుతున్నారు.

ప్రకాశ్‌రాజ్ పై మండిపడిన నాగబాబు

గ్రేట‌ర్ ఎన్నిక‌లలో పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న పోరు కాస్త ఇప్పుడు యాక్ట‌ర్స్ మ‌ధ్య‌‌కు మారింది. రీసెంట్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఉద్దేశించి న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

పవన్ కల్యాణ్ ఒక ఊసరవెల్లి: ప్రకాష్ రాజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఆయనను ఊసరవెల్లితో పోలిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీఎం పర్యటనకు సీఎం కేసీఆర్‌కు అనుమతి లేదట...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు.