close
Choose your channels

ఇదో సిల్లీ కేసు.. టీవీ9 వివాదం పై శివాజీ ఫస్ట్ టైం స్పందన 

Saturday, May 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇదో సిల్లీ కేసు.. టీవీ9 వివాదం పై శివాజీ ఫస్ట్ టైం స్పందన 

టీవీ9 చానల్ యాజమాన్యంతో వివాదాల నేపథ్యంలో మాజీ సీఈవో రవిప్రకాష్, టాలీవుడ్ నటుడు, గరుడ పురాణం శివాజీ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ వివాదంలో మూడు కేసులు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మరోవైపు వరుస నోటీసులు.. తాజాగా లుక్‌ అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో.. ఈ నోటీసులు విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్న మాట. ఇదిలా ఉంటే ఈ వివాదంపై ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన గరుడ పురాణం శివాజీ ఫస్ట్ టైం స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు.

ఇదో సిల్లీ కేసు..!

"నాపై పెట్టింది పెద్ద కేసేమీ కాదని.. ఇంత చిన్న కేసు.. సిల్లీ కేసు.. నేను విదేశాలకు పారిపోవాల్సిన అవసరం కూడా లేదు. పదేళ్లుగా రవిప్రకాశ్‌తో ఉన్న స్నేహాన్ని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఒప్పందాన్ని కోర్టులో పరిష్కరించుకుందామని ప్రయత్నిస్తుంటే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో, మరెక్కడో రిసార్టుల్లో తలదాచుకున్నారని 10టీవీ, సాక్షి టీవీ, రామేశ్వర్ రావు గారి చానళ్లలో తోచిన విధంగా మాట్లాడుతున్నారు. మీ దగ్గర డబ్బులుంటే మీడియాతో మీరు ఏమైనా చేసుకోండి. అది మీ ఇష్టం.

కానీ, ఓ వ్యక్తిని టార్గెట్ చేసి తొక్కేయాలని ప్రయత్నించడం కుదరనిపని. అయినా ఏంటి మీరు తొక్కేది? నెహ్రూ గారు తన జీవితంలో దాదాపు 9 ఏళ్లపాటు జైల్లోనే ఉన్నారు. నేనిప్పుడు జైలుకు వెళితే పోలీసులేమైనా మర్డర్ చేస్తారా? జై ఆంధ్రా ఉద్యమంలో ఎంతమంది జైలుకు వెళ్లలేదు? ఇప్పుడు మీరు విషయం అర్థం చేసుకోవాలి. ఇది నాకు, రవిప్రకాశ్‌కు మధ్య ఉన్న వ్యవహారం. పైగా కోర్టులో ఉంది. ఇద్దరం స్నేహపూర్వక వాతావరణంలో చేసుకున్న ఒప్పందం అది. ఇదో సిల్లీ కేసు" అని శివాజీ చెప్పుకొచ్చాడు.

శునకానందమా..!?

"ఎలాంటి మ్యాటర్ లేని ఈ కేసులో ట్విట్టర్ వేదికగా, టీవీల వేదికగా శునకానందం పొందుతున్న సోదరులందరికీ చెప్పేదొక్కటే, ఇప్పుడు మీరు రాళ్లు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఓ కొండ. ఇలాంటి రాళ్లకు భయపడను. కానీ మీరు ఉన్న గాజు గదులు మీరు విసిరే రాయి దెబ్బకు పగిలిపోతాయి. ముందు ఆ విషయం చూసుకోండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అనుసరించి నేను ముందుకు వెళుతున్నాను. దేనికీ ఇబ్బంది పడను. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు అనుకోని ప్రభుత్వం వచ్చినా పోరాడేందుకు నేను సిద్ధం" అంటూ గరుడ పురాణం శివాజీ చెప్పుకొచ్చాడు.

అన్ని చెప్పిన గరుడ పురాణం శివాజీ పోలీసుల నోటీసుల గురించి మాత్రం స్పందించడం కానీ.. పీఎస్‌కు వచ్చి హాజరవుతానని కానీ చెప్పకపోవడం గమనార్హం. బహుశా గరుడ పురాణం మాదిరిగా ఇవన్నీ ముందే తెలిసుంటే చేయాల్సిన పనులన్నీ చేసేసేవాడేమో అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సో.. ఇప్పటికే అటు రవిప్రకాష్, శివాజీ ఈమెయిల్స్ గుట్టురట్టు చేసిన పోలీసులు వారిద్దరూ ఎక్కడున్నారు..? ఈ మెయిల్స్ ఎక్కడ్నుంచి పంపారు..? ఐపీ అడ్రస్‌లు అన్ని పట్టేసిన పోలీసులు త్వరలోనే వారిద్దర్నీ అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. సో.. మున్ముంథు పరిస్థితి ఎంత వరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.