సెన్సార్ పూర్తి చేసుకున్న 'సైజ్ జీరో'

  • IndiaGlitz, [Friday,November 20 2015]

ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యాన‌ర్‌ఫై అనుష్క‌, ఆర్య ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం సైజ్ జీరో'. ఈ చిత్రం క్యారెక్ట‌ర్ అనుష్క 20 కిలోల బ‌రువు పెర‌గ‌డం అనుష్కకు సినిమాల ప‌ట్ట ఉన్న క‌మిట్‌మెంట్‌ను తెలియ‌జేసింది. అనుష్క ఇలాంటి డిఫ‌రెంట్ రోల్ చేయ‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రం న‌వంబ‌ర్ 27న గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల‌వుతుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ;యు/ఎ; సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. బాహుబ‌లి', 'రుద్ర‌మ‌దేవి' చిత్రాలు త‌ర్వాత అనుష్క చేస్తున్న‌చిత్రం సైజ్ జీరో'.

సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. త‌మిళంలోఇంజి ఇడుప‌ళ‌గి అనే పేరుతో త‌మిళంలో, సైజ్ జీరో పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, నార్త్ ఇండియా, యు.ఎస్‌.ఎ., గ‌ల్ఫ్‌, మ‌లేషియా, సింగ‌పూర్‌, శ్రీలంక‌, యు.కె., యూర‌ప్‌, ఆఫ్రికా, అస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో విడుద‌ల‌వుతుంది.

More News

హరీష్ శంకర్ అలా ఫిక్స్ అయ్యాడు..

షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై..మిరపకాయ్ సినిమాతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఆతర్వాత గబ్బర్ సింగ్ తో సెన్సేషనల్ హిట్ సాధించి ఇండస్ట్రీ ద్రుష్టిని ఆకర్షించిన హరీష్ శంకర్ రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ అవ్వడంతో వెనకబడిపోయాడు.

మరో ప్రయత్నం చేస్తున్న గౌతమ్..

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో గౌతమ్ నటుడుగా మంచి మార్కులు సంపాదించినా.. ఆశించిన స్ధాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేక పోయాడు.

డిసెంబర్ 13న ఒంగోలులో 'సౌఖ్యం' ఆడియో విడుదల

సౌఖ్యం అనే మాటను వింటుంటే మనసుకు సుఖంగా ఉంటుంది.అహర్నిశలూ వ్యక్తి పాటుపడేది సౌఖ్యంగా జీవించడానికే.కుటుంబం సౌఖ్యంగా ఉండాలి.

ఆ ఇద్దరు యువ హీరోలు కలిసి నటిస్తున్నారు..

యువ హీరోలు నాగ శౌర్య, నారా రోహిత్ ఈ ఇద్దరు కలసి నటిస్తున్నారా అంటే...అవుననే అంటున్నారు చిత్రయూనిట్. ఇటీవల నారా రోహిత్ హీరోగా జ్యోఅచ్చుతానంద అనే సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే.

'సైజ్ జీరో' తో కనెక్ట్ అవుతారట

రెండేళ్ల క్రితం విడుదలైన'వర్ణ' కోసం తొలిసారిగా జతకట్టిన ఆర్య,అనుష్క..మరోసారి 'సైజ్ జీరో' కోసం జోడీ కట్టిన సంగతి తెలిసిందే.