ఆర్టిస్టుల మధ్య భౌతిక దూరం కుదరదు : నరేష్

  • IndiaGlitz, [Friday,May 29 2020]

ఆర్టిస్టుల మధ్య భౌతిక దూరం అంటే కుదరదని.. ఎందుకంటే మేం మాస్క్‌లు పెట్టుకోలేమని అంతేకాకుండా దూరంగా ఉండి రొమాన్స్ సీన్స్‌లో నటించలేమని సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడు నరేష్ చెప్పుకొచ్చారు. ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో సినిమా, టెలివిజన్ రంగ ప్రముఖులు ఎంసీహెచ్ఆర్డీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్ పరిస్థితేంటి..? ఎలా చిత్రీకరణ జరుపుకోవాలి..? సెట్‌లో ఎంతమంది ఉండాలి..? ఎంతసేపు షూటింగ్ చేయాలి..? ఇలా పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా నటీనటుల బాధను ప్రభుత్వానికి విన్నవించిన ఆయన.. నిర్మాతలే తమ భద్రతా, బాధ్యతలు చూసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాం..!

‘దూరంగా నుంచి లవ్ సీన్స్ చేయలేం. ఎమోషన్ కోసం దగ్గర్నుంచే చేయాలి. టచ్ అప్, మేకప్ బాయ్స్ ఎప్పుడూ మమ్మల్ని టచ్ చేస్తూనే ఉంటారు. దీనికి కావాల్సిన మెజర్స్ గురించి మాట్లాడటం జరిగింది. అందరికీ ప్రొడ్యూసర్సే మాస్క్‌లు, సూట్‌లు, గ్లౌజ్‌లు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదే విధంగా సేఫ్టీ ఆఫ్ ది యూనిట్ కొరకు అబ్జవర్స్‌ను కావాలని కోరాం. ప్రతి యూనిట్‌కు ఒక అబ్జవర్‌ను ఏర్పాటు చేయాలని కోరాం. హోం సెక్రటరీగారు తీసుకున్న నిర్ణయాలు చాలా సంతోషించదగ్గవి. తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూనే బాధ్యతలను ఇండస్ట్రీపైనే వదిలింది. షూటింగ్స్ చేసుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ గారికి.. తెలంగాణ ప్రభుత్వానికి మేం ఎంతగానో రుణపడి ఉన్నాం. కళాకారుల పెన్షన్ కోసం లిస్ట్ తయారు చేసి పంపుతాం. అదేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేసునేదానిపై అదే విధంగా సినిమాను ఏవిధంగా గట్టెక్కించాలనేదానిపై త్వరలోనే హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిశితంగా చర్చిస్తాం’ అని నరేష్ చెప్పారు.

More News

త‌ల‌సాని గారి కృషి అభినంద‌నీయం : మెగాస్టార్

14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సరుకుల పంపిణీ ప్రారంభం సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి

బాలయ్య ఎందుకలా అన్నారో కనుక్కుంటా.. సీఎంకు వివరిస్తా!

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలపై సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్‌లో నివురు గప్పిన విబేధాలు.. అసలెందుకిలా..!?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయా..? నిన్న మొన్నటి వరకూ ఇండస్ట్రీ మొత్తం ఏకథాటిపైనే ఉందనుకున్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయా..?

బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు

టాలీవుడ్ సినిమా షూటింగులు పున: ప్రారంభించడంపై నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి 2020 బాగా క‌లిసొచ్చింది. ఈయ‌న హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’.