close
Choose your channels

Sai Charan : అమెరికాలో విషాదం.. తెలుగు యువకుడిని కాల్చి చంపిన నల్లజాతీయుడు

Wednesday, June 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయ విద్యార్ధులు అక్కడి ఉన్మాదుల చేతుల్లో దారుణహత్యలకు గురవుతున్నారు. జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుని కుటుంబానికి అండగా వుంటాడనుకున్న కుమారులు కానరాని లోకాలకు తరలి వెళ్లిపోవడంతో కన్నవారు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాజాగా అమెరికాలో తెలుగు విద్యార్ధి హత్యకు గురయ్యాడు.

ఫ్రెండ్‌ను డ్రాప్ చేసి వెళ్తుండగా ఆగంతకుడి కాల్పులు:

వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన నక్కా సాయిచరణ్ గత రెండేండ్లుగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌ ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో దించి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అతనిపై ఓ నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సాయి చరణ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణవార్తను స్థానిక అధికారులు సాయిచరణ్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాయిచరణ్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.