గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో 'సోలో బ్రతుకే సో బెటర్', 'అమృతం ద్వితీయం' కొత్త ఎపిసోడ్లు విడుదల

  • IndiaGlitz, [Monday,January 25 2021]

తెలుగు ప్రజలకు వినోదం అందించడమే లక్ష్యంగా ప్రతి వారం, ప్రతి నెల సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు విడుదల చేస్తున్న ఏకైక ఓటీటీ వేదిక 'జీ 5'. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా సహా 'అమృతం ద్వితీయం' కొత్త ఎపిసోడ్లు విడుదల చేయనుంది.

సాయి తేజ్ కథానాయకుడిగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాను జీ గ్రూప్ థియేటర్లలో విడుదల చేసింది. లాక్ డౌన్ తరువాత వెండితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఇప్పుడు డిజిటల్ తెర వీక్షకులకు వినోదాన్ని అందించడానికి ఓటీటీలో ఈనెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కరోనా కాలంలో ఇళ్లకు పరిమితమైన ప్రజలకు 'అమృతం ద్వితీయం' ఎపిసోడ్లు వినోదాన్ని అందించిన సంగతి తెలిసిందే వీక్షకులు మెచ్చిన ఈ సిరీస్ నుంచి సరికొత్త ఎపిసోడ్లను సైతం ఈ నెల 25న విడుదల చేయనున్నారు.

ఆల్రెడీ జనవరిలో రెండు తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, ఒక తెలుగు సినిమాతో పాటు 'వర్జిన్ భాస్కర్' సీజన్ 2ను తెలుగు వీక్షకులకు 'జీ 5' ఓటీటీ అందించింది. ఈ నెల 13న సూరజ్ పే మంగళ్ భరి తెలుగు వెర్షన్ ను విడుదల చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న 'నేను కేరాఫ్ నువ్వు' వెబ్ సిరీస్ తొలి సీజన్, 15న 'రోమియో జూలియట్' సినిమా, 19న 'శివంగి' తొలి సీజన్ పార్ట్ 1 'జీ 5'లో వీక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పుడు 25న 'సోలో బ్రతుకే సో బెటర్', 'అమృతం ద్వితీయం' కొత్త ఎపిసోడ్లు వస్తున్నాయి.

బహుశా... తెలుగు వీక్షకులకు ఎక్కువ ఒరిజినల్ సిరీస్ లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు అందించిన ఓటీటీ 'జీ 5' అంటే అతిశయోక్తి కాదేమో. ఆల్రెడీ 'కైలాసపురం', 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి (గాడ్)', 'చదరంగం', 'అమృతం ద్వితీయం', 'లూజర్', 'ఎక్స్ పైరీ డేట్', 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' వంటి హిట్ సిరీస్ లు ప్రజలకు అందించినది జీ 5 అనే సంగతి తెలిసిందే.

More News

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న 'గాలిసంప‌త్' మార్చి 11న విడుద‌ల‌

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ఫ‌ణ‌లో రూపొందుతోన్నచిత్రం 'గాలి సంప‌త్`. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో

గుంటూరులో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశావర్కర్ ఆదివారం మృతి చెందారు.

పవన్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..

జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన సవాళ్లు ప్రతిసవాళ్లకు వేదికగా మారుతోంది.

ప్రదీప్ మాట్లాడుతుండగా.. స్టేజిపైనే కుప్పకూలిన డైరెక్టర్

ఆనందంగా సాగిపోతున్న ప్రెస్‌మీట్‌లో ఊహించని ఘటన షాక్‌కు గురి చేసింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి చేస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’.

ఆ దృశ్యాలు నా గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి: పవన్

దివీస్ నిరసనకారుల విడుదల సంతోషాన్నిచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అక్కడి బాధితుల ఆవేదన, ఆక్రందనలను స్వయంగా చూశానన్నారు.