గాన గంధర్వుడి చివరి పాట ఇదే...

  • IndiaGlitz, [Friday,September 25 2020]

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినీ కెరీర్.. 1966లో పద్మనాభం నిర్మించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆయన 40 వేలకు పైగా పాటలను.. విభిన్న భాషల్లో పాడారు. భారతీయ సినీ చరిత్రలోనే ఇది ఇంకెవరికీ సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన తండ్రి.. చదువు కావాలా? పాట కావాలా? అని అడిగితే పాటే కావాలని కోరారట. నాటి నుంచే ఆయనకు పాటలంటే అంతటి ప్రేమ. అయితే ఆయన చివరి సారిగా ‘పలాస 1978’ సినిమాలో పాడారు.

‘ఓ సొగసరి’ అంటూ సాగే ఈ పాటను లక్ష్మీ భూపాల రాయగా.. రఘు కుంచె స్వరపరిచారు. బాలు, బేబి కలిసి ఈ పాట పాడారు. ఇదే ఆయన చివరి పాట అయింది. దీనిపై ఆ ‘పలాస 1978’ చిత్ర సంగీత దర్శకుడు, ఆ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన రఘు కుంచె మాట్లాడుతూ.. పలాస చిత్రంలో బాలు పాట పాడడం తన అదృష్టమన్నారు. బాలు నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని, ఒక గొప్ప గాన గాంధర్వుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

More News

బాలుపై వచ్చిన ఆ ఆర్టికల్ తెగ వైరల్ అవుతోంది..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినీ కెరీర్.. 1966లో పద్మనాభం నిర్మించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ప్రారంభమైంది.

రేపు సాయంత్రం తామరైపాకంలో బాలు అంత్యక్రియలు..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు.

బాలు, నేనూ శ్రీకాళహస్తిలో చదివాం.. రూ.100 తీసుకున్నా: మోహన్‌బాబు

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేడు పరమపదించిన విషయం తెలిసిందే.

చావంటే తెలియకుండా కన్నుమూయాలి: ఎస్పీబీ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో దాదాపు 40వేల పాటలు పాడారు.

ఎస్పీబీకి కరోనా పాజిటివ్‌ అని తేలినప్పటి నుంచి మినిట్ టు మినిట్

గాన గంధర్వుడు గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు.