ఎస్పీబీకి క‌రోనా నెగ‌టివ్‌

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా వైర‌స్ కార‌ణంగా కొన్నిరోజులుగా హాస్పిట‌ల్‌ల‌కే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆరోగ్యం బాగుప‌డాల‌ని ఆయ‌న అభిమానులు, సంగీతాభిమానులు కోరుకుని ప్రార్థ‌న‌లు కూడా చేశారు. క్ర‌మంగా ఎస్పీబీ ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంది. రీసెంట్‌గా జ‌రిపిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు క‌రోనా నెగ‌టివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్ స్పెష‌ల్ వీడియో ద్వారా తెలియ‌జేశారు. ‘‘క్ష‌మించండి.. నాన్న ఆరోగ్యం గురించి వారాంతంలో అప్‌డేట్ ఇవ్వ‌లేక‌పోయాను. ప్ర‌స్తుతం ఆయ‌న ఊపిరితిత్తులు పనితీరు మెరుగ్గా ఉంది. దాంతో వెంటిలేట‌ర్‌ను తొల‌గిస్తార‌ని మేం భావించాం. అయితే ఆయ‌న ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్‌ఫెక్ష‌న్ ఉండ‌టంతో వెంటిలేట‌ర్ తీయ‌డానికి సాధ్య‌ప‌డ‌లేదు. తాజాగా చేసిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్ వ‌చ్చింది’’ అన్నారు.

ఆగ‌స్ట్ 5 నుండి ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా సోక‌డంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఒకానొక దశ‌లో ఆయ‌న ఆరోగ్యం క్రిటిక‌ల్ ద‌శ‌కు చేరుకుంది. అయితే ఇక్క‌డి డాక్ట‌ర్స్ వైద్యంతో పాటు విదేశీ డాక్ట‌ర్స్ కూడా వైద్య స‌ల‌హాలు ఎంత‌గానో ఆయ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ్డాయి. క్ర‌మంగా ఆయ‌న కోలుకుంటూ వ‌స్తున్నారు.

More News

మహేశ్‌ను బాలీవుడ్ స్టార్ ఢీ కొడ‌తాడా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కన్ఫ్యూజన్ ‘రంగ్ దే’ టీమ్

యువ క‌థానాయ‌కుడు నితిన్, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ ఏడాది భీష్మ‌తో హిట్ కొట్టిన నితిన్ ఈ వేస‌విలో ‘రంగ్ దే’

శ్రీమంతుడుగా మారిన‌ ప్ర‌భాస్‌

శ్రీమంతుడుగా ప్ర‌భాస్‌..! అదేంటి శ్రీమంతుడు మ‌హేశ్ క‌దా!! అనే సందేహం చాలా మందికి వ‌చ్చుండొచ్చు.

సోనూసూద్‌పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన పోసాని..

కరోనా మహమ్మారి కారణంగా ముఖ్యంగా ప్రజానీకానికి ఎవరేంటనేది తెలిసి వచ్చింది. రీల్ లైఫ్ హీరోలు కాస్తా..

సత్యదేవ్‌ కొత్త చిత్రం 'తిమ్మరుసు'

విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో నటుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం 'తిమ్మరుసు'.