ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్..

ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జలుబు, జ్వరం తప్ప తన ఆరోగ్యం బాగానే ఉందని ఎవరూ కంగారు పడొద్దని ఓ వీడియో సందేశం ద్వారా అభిమానులకు తెలిపారు.

‘‘నేను రెండు మూడు రోజులుగా కాస్త ఇబ్బందికరంగా ఫీలవుతున్నా. చెస్ట్‌లో ఫ్లమ్ ఫామ్ అవుతోంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్నా. ఈ మూడు ఇబ్బందులు తప్ప మరే ప్రాబ్లమ్ లేదు. కానీ నేను దాన్ని ఈజీగా తీసుకోదలుచుకోలేదు. కాబట్టి ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాను. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మైల్డ్‌గా ఉండటం వలన సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి వైద్యుల సూచనలను పాటించమని చెప్పారు. కానీ నేను ఇంట్లో ఉంటే నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇబ్బందవుతుందని హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. నా స్నేహితులంతా ఇక్కడ ఉన్నారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేనెలా ఉన్నానోనని ఎవరూ కంగారు పడొద్దు. నేను బాగానే ఉన్నాను’’ అని ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు.

More News

ఆర్జీవీ బాట‌లో ఆయ‌న శిష్యుడు!!

ద‌ర్శ‌క నిర్మాత‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ వూర‌ఫ్ ఆర్జీవీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.

తెలంగాణలో కొత్తగా 2012 కేసులు..

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం రెండు వేలకు పైనే కేసులు నమోదయ్యాయి.

బీరుట్‌లో భారీ పేలుళ్లు.. 78 మంది మృతి

లెబనాన్‌ రాజధాని బీరుట్‌‌లో పేలుళ్లు అక్కడి ప్రజల వెన్నులో వణకు పుట్టించాయి.

ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. గవర్నర్ గెజిట్‌పై హైకోర్టు స్టే..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల బిల్లుపై ఈ నెల 14 వరకూ హైకోర్టు స్టే విధించింది.

విశాల్‌కు వ్య‌తిరేకంగా మ‌రో నిర్మాత‌ల మండ‌లి

హీరో, నిర్మాత, ద‌ర్శకుడు విశాల్‌కు క‌రోనా క‌ష్టాలతో పాటు కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. విశాల్ హీరోగా సినిమాలు చేయ‌డ‌మే కాదు..