బాల‌సుబ్ర‌మ‌ణ్యంకు చేదు అనుభ‌వం

  • IndiaGlitz, [Sunday,November 03 2019]

భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల గాంధీజీ 150వ జ‌యంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన చేంజ్ విత్ ఇన్ కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ స్టార్స్‌కే పెద్ద పీట వేశారు. ద‌క్షిణాది తార‌ల‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్కలేదు. తెలుగు సినిమా పరిశ్ర‌మ నుండి దిల్‌రాజు మాత్ర‌మే ఈ వేడుక‌కి పాల్గొన్నార‌ని తెలిసింది. అయితే అస‌లు విష‌య‌మేమంటే గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం కూడా ఈ వేడుక‌కి హాజ‌ర‌య్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే తెలియ‌జేశారు.

''రామోజీరావుగారి చొర‌వ‌తో ప్ర‌ధాని మోడీగారు నిర్వ‌హించిన రిసెప్ష‌న్‌కు హాజ‌రు కాగ‌లిగాను. అందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు. అయితే ప్ర‌ధాని మోదీ ఇంట ప్ర‌వేశించిన త‌ర్వాత మా సెల్‌ఫోన్స్‌ను భ‌ద్ర‌తా సిబ్బంది తీసుకున్నారు. మాకు టోకెన్లు ఇచ్చారు. కానీ లోప‌లికి వెళ్లాం. తీరా మోదీగారు వ‌చ్చిన త‌ర్వాత స్టార్స్ సెల్ఫీలు తీసుకున్నారు'' అన్నారు బాల‌సుబ్ర‌మ‌ణ్యం. త‌న‌కు ఓ ర‌కంగా చేదు అనుభ‌వ‌మే ఎదురైన‌ట్లు బాల‌సుబ్ర‌మ‌ణ్యం పేర్కొన్నారు. ఇప్ప‌టికే ద‌క్షిణాది తార‌ల‌కు చేంజ్ విత్ ఇన్ కార్య‌క్ర‌మంలో మోదీ త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని అంద‌రూ గుర్రుగా ఉన్నారు. ఈ త‌రుణంలో బాల‌సుబ్ర‌మ‌ణ్యం త‌న అనుభ‌వాన్నికూడా తెలియ‌జేయ‌డం మరింత కారం చెల్లించిన‌ట్లు అయ్యింది.

More News

యూ ట్యూబ్‌ను షేక్ చేసిన  ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’!

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్దే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేశ్’.

పవన్‌ ఓటమికి అసలు కారణం చెప్పిన మంత్రి అనిల్!

ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో

లాంగ్ మార్చ్‌పై అసత్యపు ప్రచారాలు నమ్మొద్దు: పవన్

భవన నిర్మాణ కార్మికులకు అండగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభం

పాట కోసం ఐదు కోట్ల రూపాయలా?

ఈ మధ్య సినిమాలో భాగమైన భారీ సెట్స్‌కు భారీగా ఖర్చు పెడుతున్నారంటేనే అబ్బో అని అనుకునేవాళ్లం.

రజనీ కొత్త సినిమా టైటిల్‌ ఏంటంటే?

ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌' సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారో లేదో.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన 168వ చిత్రాన్ని వెంటనే ప్రకటించారు.