దుష్ప్రచారం వద్దు... ప్రెస్‌మీట్‌ పెడతా!

  • IndiaGlitz, [Monday,September 28 2020]

లెజెండ్రీ సింగర్‌, గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కరోనా వైరస్‌ కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆంత్యక్రియలు ముగిసిన తర్వాత.. కొందరు బాలసుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా రూమర్స్‌ను క్రియేట్‌ చేశారు. ఎంజీఎం హాస్పిటల్‌కు, బాలు కుటుంబానికి మధ్య హాస్పిటల్‌ బిల్‌కు సంబంధించిన గొడవ జరిగిందని, చణ్‌ విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు తీసుకెళ్తే.. ఆయన బిల్లు కట్టాడని వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీనిపై బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్‌ స్పందించారు.

''కొందరు కావాలనే నాన్న హాస్పిటల్‌ బిల్‌కు సంబంధించిన మాకు, ఆసుపత్రి వర్గాలకు మధ్య గొడవ జరిగిందని, చివరకు వెంకయ్యనాయుడుగారు సెటిల్‌ చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనేది నాకు తెలియడం లేదు. అయితే నాన్నకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. డాక్టర్స్ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. మెరుగైన వైద్యం అందించారు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారికి నిజానిజాలు తెలియవు. కాబట్టి హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌తో చర్చించి అభిమానులందరికీ వివరిస్తూ ఓ ప్రెస్‌మీట్‌ పెట్టాలని అనుకుంటున్నాను అన్నారు ఎస్‌.పి.చరణ్‌.

More News

దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దేవి నాగవల్లి ఎలిమినేట్ అవడానికి కారణాలివే...!

బిగ్‌బాస్ సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. అయితే మూడో వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు.

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో మూవీ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది.

దేవి ఎలిమినేట్.. బాగా గేమ్ ప్లే చేస్తున్న బిగ్‌బాస్..

సన్ డే.. ఫన్ డే కాబట్టి సందడి సందడిగా సాగిపోయింది. ‘మన రికార్డ్ మనమే బ్రేక్ చేసుకుందాం’ టాస్క్‌లో భాగంగా ముందు అభిజిత్..

డిగ్రీ అర్హత పరీక్ష రాసిన నటి హేమ..

సినీ నటి హేమ ఓపెన్ డిగ్రీ పరీక్షలకు హాజరయ్యారు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి వచ్చిన హేమ..