శ్రీవిష్ణు హీరోగా 'మెంటల్ మదిలో' ఫస్ట్ లుక్ విడుదల!

  • IndiaGlitz, [Wednesday,February 15 2017]

"పెళ్లిచూపులు" చిత్రంతో తెలుగు చిత్రసీమలో చిన్నసైజు సంచలనం సృష్టించిన నిర్మాత రాజ్ కందుకూరి ఇప్పుడు "మెంటల్ మదిలో" అంటూ మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
"అప్పట్ళో ఒకడుండేవాడు"తో సూపర్ హిట్ అందుకొన్న శ్రీవిష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ అనే యువ ప్రతిభాశాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజ్ కందుకూరి నిర్మిస్తున్న "మెంటల్ మదిలో" ఫస్ట్ లుక్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్ర బృందం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కోసం సన్నద్ధమవుతోంది. శ్రీవిష్ణు సరసన నివేథా పెతురాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం" ప్రశాంత్ విహారి, సినిమాటోగ్రఫీ: వేదా రామన్, ఎడిటర్: విప్లవ్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, నిర్మాత: రాజ్ కందుకూరి, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ!