శ్రీదేవిపై ఐదు భాగాలుగా డాక్యుమెంటరీ

  • IndiaGlitz, [Sunday,February 18 2018]

ఇటీవల బాలీవుడ్‌లో సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్” సినిమా వచ్చింది. క్రికెట్‌లో దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్‌పై ఈ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో సీనియ‌ర్ నటీమణి శ్రీదేవిపై కూడా ఒక డాక్యుమెంటరీని తెరకెక్కించాలని బెంగుళూరుకు చెందిన ఆమె ఫాన్స్ క్లబ్ నిర్ణయించింది. ఈ డాక్యుమెంటరీని ఐదు భాగాల సిరీస్ గా రూపొందించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం గురించి ఇప్ప‌టికే శ్రీ‌దేవి భర్త బోనీకపూర్‌ను సంప్రదించడం..ఆయన కూడా సానుకూలంగా స్పందిండం జ‌రిగింద‌ట‌. ఈ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే.. తొలి భాగంలో శ్రీదేవి బాల్యానికి సంబంధించి ఆమె సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది అన్న విషయాన్ని చూపించనున్నారు. ఇక రెండు, మూడు భాగాలకు సంబంధించి బాలీవుడ్ లో ఆమె ప్రవేశం, ఆపై ఆమె జీవితం చూపిస్తూనే..నాల్గవ భాగంలో ఆమె సాధించిన సినీ విజయాల వివరాలను విశదీకరించనున్నారు. ఇక ఆఖరి భాగమైన ఐదవ భాగంలో శ్రీదేవితో కలిసి నటించిన నటీనటుల ఇంటర్వ్యూలతో కూడిన‌ సినిమా వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయని ఆమె అభిమానుల సంఘం పేర్కొంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలు కూడా చూపించనున్నామని పేర్కొన్నారు.

More News

థియేటర్ లో మహేష్ పోరాటాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’.

భానుమతి పాత్రలో అనుష్క....

టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న అనుష్క..

బాలీవుడ్ రీమేక్ లో జ్యోతిక...

హీరో సూర్య ను పెళ్లి చేసుకుని సినిమాల నుండి తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఇప్పుడుసినిమాల్లో నటిస్తుంది.

వర్మ విచారణ...

సామాజిక కార్యకర్త దేవి..దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

నారా రోహిత్ తో బెంగాలి భామ

'బాణం',‘సోలో', 'ప్రతినిధి' వంటి భిన్నమైన కథలతో విజయాలను సొంతం చేసుకున్న కథానాయకుడు నారా రోహిత్.