తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఉంది - శ్రీ దివ్య

  • IndiaGlitz, [Sunday,May 13 2018]

'మనసా' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'బస్‌స్టాప్‌', మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు', 'కేరింత' వంటి సినిమాల్లో అందరికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.

అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ తెలుగులో శ్రీదివ్యకు ఆశించిన ఆదరణ లభించలేదు. ఆమె టాలెంట్‌ను తమిళ చిత్ర పరిశ్రమ గుర్తించింది. ఒక్కసారిగా తెలుగు సినిమాలకు దూరమైపోయింది శ్రీదివ్య. తమిళ్‌లో లెక్కకు మించిన సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌ అయిపోయింది. అయితే ఒక తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలన్నది శ్రీదివ్య కోరిక.

మన దర్శకనిర్మాతలు మాత్రం పరభాషా హీరోయిన్లను దిగుమతి చేసుకునే పనిలోనే ఉన్నారు తప్ప తెలుగు అమ్మాయిల టాలెంట్‌ను గుర్తించలేకపోతున్నారు. అయితే తమిళ ఇండస్ట్రీ శ్రీదివ్యను సాదరంగా ఆహ్వానించింది. తన అందంతో, అభినయంతో తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

పరభాషా చిత్రాల్లో నటించి ఎంత పేరు తెచ్చుకున్నా తెలుగు సినిమాల్లో తన ప్రతిభకు తగ్గ గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరిక తప్పకుండా ఉంటుంది. తాజాగా శ్రీదివ్య మీడియాకు విడుదల చేసిన ఫోటోలను చూస్తుంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే కాదు, ట్రెండీగా ఉండే గ్లామర్‌ క్యారెక్టర్స్‌ కూడా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట

More News

ఎ బి టి క్రియేషన్స్ వారి 'వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ' చిత్ర ప్రారంభోత్సవం...

ఎబిటి క్రియేషన్స్ పతాకంపై మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సమర్పణలో ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్ కె. రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం " వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ".

న్యూజెర్సీ ప్ర‌భుత్వం నుండి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్‌

41 సినీ ప్ర‌స్థానంలో న‌వ ర‌సాలున్న ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌. 237 సినిమాల్లో న‌టించిన ఈయ‌న ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించారు.

ర‌వితేజ‌కు కూతురు కావాల‌ట‌...

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్‌పై రెండు సినిమాలు రూపొందుతున్నాయి.

కె.వి.పి పాత్ర‌లో రావు ర‌మేశ్‌

యాత్ర పేరుతో మ‌హి .వి.రాఘ‌వ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సూర్య చిత్రంలో శిరీశ్‌

మెగా క్యాంప్ హీరో అల్లు శిరీశ్ ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌నున్నారు.  గ‌త ఏడాది మ‌ల‌యాళంలో న‌టించిన ఈ స్టార్ ఇప్పుడు త‌మిళంలో కూడా న‌టించ‌బోతున్నాడు.