శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,October 12 2016]

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్‌ పూర్తయింది.
అక్టోబర్‌ 19న ఆడియో
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సత్తిబాబు, నవీన్‌చంద్ర కాంబినేషన్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రేక్షకులకు హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదాన్ని అందించే హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సత్తిబాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీవసంత్‌ అందించిన మ్యూజిక్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. అక్టోబర్‌ 19న ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ చివరి వారంలోగానీ, నవంబర్‌ మొదటి వారంలోగానీ వరల్డ్‌వైడ్‌గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాస్‌ చేస్తున్నాం'' అన్నారు.
నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

More News

భద్రాద్రి మూవీస్ 'కత్తిలాంటి కుర్రాడు' ప్రారంభం

భద్రాద్రి మూవీస్ బ్యానర్పై విసుశ్రీ, అక్ష, హమీదా హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం కత్తిలాంటి కుర్రాడు విజయదశమి సందర్భంగా హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది.

ఆస్ట్రేలియాలో పాటల చిత్రీకరణలో స్టైలిష్ ఎంటర్ టైనర్ క్రికెటర్ శ్రీశాంత్ 'టీమ్ 5' చిత్రం

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి క్రికేటర్ నే కాదు మంచి డ్యాన్సర్ అని ఈచిత్రంతో తెలుస్తుంది. రాజ్ జకారిస్ ప్రోడ్యూసర్ గా తన ప్రొడక్షన్ వాల్యూస్, సురేష్ గోవింద్ చెప్పిన కథ, కథనం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.

న‌క్ష‌త్రం సెకండ్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం న‌క్ష‌త్రం. ఈ చిత్రంలో సందీప్ కిష‌న్, రెజీనా జంట‌గా న‌టిస్తున్నారు.  మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ గా గెస్ట్ రోల్ చేస్తుండ‌డం విశేషం.

చ‌ర‌ణ్ ధృవ టీజ‌ర్ - 1 మిలియ‌న్ వ్యూస్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ధృవ‌. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.

సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఎనౌన్స్ చేసిన అల్లు శిరీష్..!

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంతో ఇటీవ‌ల విజయం సాధించిన అల్లు శిరీష్ త‌న నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేసాడు. అయితే...నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వేణు ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ గ‌తంలో ఓ చిత్రాన్ని ప్రారంభించారు.