హీరో శ్రీకాంత్ చిత్రం 'రా.రా...' ద్వితీయ ప్రచార చిత్రం, పాట విడుదల

  • IndiaGlitz, [Tuesday,February 28 2017]

ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ద్వితీయ ప్రచార చిత్రం విడుదల వేడుక గత రాత్రి నరసారావు పేటలో జరిగింది. శ్రీకాంత్ కథానాయకునిగా 'రారా' పేరుతో రూపొందుతున్న ఈ నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించిన విషయం విదితమే. ద్వితీయ ప్రచార చిత్రం మరియు చిత్రం లోని ఓ గీతాన్ని నరసారావు పేటలోని శ్రీమిత్ర జూనియర్ కాలేజీ లో విద్యార్థిని,విద్యార్థుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధి గా ఆంధ్రప్రదేశ్ డి.ఐ.జి. శ్రీ జె.సత్యన్నారాయణ రావు, ప్రముఖ కధా నాయిక కేథరిన్ పాల్గొన్నారు. ముఖ్య అతిధులు కళాశాలలో ఉన్నత ర్యాంక్ సాధించిన విద్యార్థిని విద్యార్థుల చేతుల మీదుగా 'రా.రా...' ద్వితీయ ప్రచార చిత్రం మరియు చిత్రం లోని ఓ గీతం విడుదల అయింది.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ .. ' ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను.చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.

'రారా' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రంను విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్' పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు.

More News

దేవిశ్రీ ప్రసాద్ గురుస్మరణ

మాతృదేవోభవ,పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అనే నేర్పించారు.దేవిశ్రీ ప్రసాద్ చిన్నప్పుడు నేర్చుకున్న ఆ మాటలను అసలు మర్చిపోలేదు.

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా 'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల

ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో రాంకార్తీక్,భానుత్రిపాత్రి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' గుమ్మడికాయ వేడుక

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట`

5 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'డిజె దువ్వాడ జగన్నాథమ్ ' టీజర్

ఆర్య నుండి సరైనోడు వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్.

2017లో ఆస్కార్ విజేతలు

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఆస్కార్ అవార్డుల్లో 89వ వార్షికోత్సవ అవార్డుల ప్రధానోత్సవం డాల్బీ థియేటర్లో జరిగింది.ఇండియా నుండి ప్రియాంక చోప్రా ఈ వేడుక కు హాజరయ్యారు.