ముగ్గురు హీరోలతో రాజమౌళి...ఎవరా ముగ్గురు..!

  • IndiaGlitz, [Wednesday,July 12 2017]

'బాహుబలి2' తర్వాత రాజమౌళి చెయ్యబోయే సినిమా ఏమిటి అనే ప్రశ్నకు అందరికీ సమాధానం కావాలి. అతని నెక్స్‌ట్‌ సినిమాకి సంబంధించి రకరకాల ఊహాగానాలే తప్ప అసలు విషయం మాత్రం బయటికి రావడంలేదు. ఎట్టకేలకు ఒక వార్త మాత్రం నిజమని తెలుస్తోంది. అదేమిటంటే రాజమౌళి ఈసారి ముగ్గురు హీరోలతో సినిమా చేసే ఆలోచనలో వున్నాడట.
'బాహుబలి2'తో జాతీయ స్థాయిలో మార్కెట్‌ పెంచుకున్న రాజమౌళి తన నెక్స్‌ట్‌ సినిమాని తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం. ఒక హీరో, ఒక భాష మీదే ఆధారపడకుండా మూడు భాషలకు చెందిన ముగ్గురు హీరోలతో సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఈ విషయంలో రాజమౌళి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా ముగ్గురు హీరోలతో సినిమా చెయ్యాలన్న ఆలోచన రాజమౌళికి వుందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

More News

హన్సిక అలా అనేసిందేంటబ్బా...

పదహారేళ్ళకే హీరోయిన్ గా నటించింది.హీరోతో కలిసి స్టెప్పులేసింది.

లావణ్య కోరిక తీర్చేదెవ్వరో..

'అందాల రాక్షసి' తో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠికి నటిగా మంచి పేరు వచ్చింది.

బోయపాటి స్టైల్ మారిందా..

యాక్షన్ సినిమాలు చేయడంలో దిట్ట బోయపాటి శ్రీను.

జులై 21న విడుదలకానున్న 'మాయా మాల్'

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 14న విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు చిత్రాన్ని ఒకవారం పోస్ట్ పోన్ చేసి జులై 21న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

ఆ పది మంది డ్రగ్స్ మత్తును వీడి బయటకు రావాలని కోరుకుంటున్నాం : నిర్మాత అల్లు అరవింద్

'టాలీవుడ్ ఇండస్ర్టీలో కొంత మంది యంగ్ స్టార్స్ డ్రగ్స్ మత్తులో తేలుతున్నట్లు తెలిసింది.