close
Choose your channels

జగన్‌‌తో స్టార్ హీరో మామ భేటీ.. త్వరలో వైసీపీలోకి!

Monday, February 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. టికెట్లు రావని అసంతృప్తితో ఉన్న సిట్టింగ్‌‌లు, ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్‌‌ అటు అధికార.. ఇటు ప్రతిపక్షపార్టీలో చేరుతున్నారు. ఫిబ్రవరి నెలలో పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే.

తాజాగా.. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు (లక్ష్మీ ప్రణతి తండ్రి) వైసీపీ అధినేత వైఎస్‌‌ జగన్‌‌ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం లోటస్‌‌పాండ్‌‌కు వెళ్లిన నార్నె.. సుమారు గంటపాటు జగన్‌‌తో పలు విషయాలు చర్చించారు. ఏపీలోని రాజకీయ అంశాలపై ఇరువురూ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఎన్నికు దగ్గరపడుతున్న టైమ్‌‌లో, వైసీపీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న తరుణంలో ఎన్టీఆర్ మామ.. జగన్‌‌తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. "ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. కేవలం మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిశాను. జగన్‌తో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనను కలిశాను" అని చెప్పుకొచ్చారు. కాగా.. గత ఎన్నికల్లోనే ఆయన వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో టికెట్ కూడా అడిగారని వార్తలు వినవచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి జగన్‌‌ను కలవడం తెలుగు రాష్ట్రాల్లో, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

మొత్తానికి చూస్తే ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరితే ఎన్టీఆర్.. టీడీపీకి సపోర్ట్ చేస్తారా..? మామ తరఫున వైసీపీకి ప్రచారం చేస్తారా..? లేకుంటే సొంత అక్క ఎన్నికల్లో నిలబడితేనే ప్రచారం చేయని జూనియర్.. రేపొద్దున ఎన్నికల్లో కూడా ప్రచారం చేయకుండా మిన్నకుండిపోతారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.