నిర్మాత‌గా మారుతున్న స్టార్ హీరో

  • IndiaGlitz, [Saturday,November 14 2015]

యువ హీరో నితిన్ నిర్మాత‌గా మారి అఖిల్ సినిమా నిర్మించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా నిర్మాత‌గా మారి తండ్రి చిరుతో 150వ సినిమా నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. వీరి బాట‌లో మ‌రో స్టార్ హీరో కూడా న‌డిచేందుకు రెడీ అవుతున్నాడు. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఆయ‌నే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.

గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇత‌ర భాష‌ల్లో గీతా ఆర్ట్స్ సంస్థే నిర్మిస్తుంది అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ నిర్మాత‌గా మారి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ మూవీని క‌న్న‌డ‌లో రీమేక్ చేస్తానంటున్నాడు. మ‌రి...హీరోగా స‌క్సెస్ అయిన బన్ని నిర్మాత‌గా స‌క్సెస్ అవుతాడో లేదో చూడాలి.

More News

రామ్ ప‌దేళ్ల కెరీర్‌కి గిఫ్ట్‌

ఎనర్జిటిక్ యాక్టింగ్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన క‌థానాయ‌కుల్లో రామ్ ఒక‌డు. తొలి చిత్రం 'దేవ‌దాసు' నుంచి గ‌త చిత్రం 'శివ‌మ్' వ‌ర‌కు ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి సినిమాలోనూ త‌న ఎన‌ర్జీని ఒకే లెవ‌ల్‌లో చూపించాడు రామ్‌.

సుధీర్‌ని మెచ్చుకోవాల్సిందే

జ‌యాప‌జ‌యాల మాట ప‌క్క‌న పెడితే.. యువ క‌థానాయ‌కుడు సుధీర్‌బాబుని ఓ విష‌యంలో మెచ్చుకు తీరాల్సిందే అంటున్నారు సినీ ప‌రిశీల‌కులు.

అలా స‌రిపెట్టిన నాగ్‌

'మ‌నం' వంటి మెమ‌ర‌బుల్ మూవీ త‌రువాత.. నాగార్జున హీరోగా మ‌రో సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎదురుచూశారు.

బాలీవుడ్ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో

ఇమ్రాన్ హేష్మి అజ‌హార్ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరోకి అవ‌కాశం వ‌చ్చింది. ఇంత‌కీ...బాలీవుడ్ మూవీలో అవ‌కాశం అందిపుచ్చుకున్న ఆ టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..

బెల్లంకొండ శ్రీనివాస్ నెక్ట్స్ మూవీ ఇదే

అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై..తొలి చిత్రంతోనే స‌క్సెస్ సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.