తనయులు ప్లస్ స్టార్ హీరోలు

  • IndiaGlitz, [Friday,October 09 2015]

ద‌స‌రా పండ‌క్కి రెండు భారీ చిత్రాలు వారం రోజుల గ్యాప్‌లో రానుండ‌డ‌మే తెలుగు ప్రేక్ష‌కుల‌కి మ‌హ‌దానంద‌మైతే.. ఇద్ద‌రు అగ్ర నాయ‌కులు చెరో సినిమాలో త‌ళుక్కున మెర‌వ‌డం మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ పెంచిన‌ట్ల‌వుతోంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఈ నెల 16న 'బ్రూస్ లీ' చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. ఆయ‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇవ్వ‌నున్నారు. సినిమా క్లైమాక్స్ సీన్స్‌లో చిరు మెరుపులా మెరుస్తార‌ట‌. దాదాపు 6 ఏళ్ల త‌రువాత చిరంజీవి న‌టిస్తున్న సినిమా త‌న త‌న‌యుడిదే కావ‌డం విశేషం.

ఇక ఈ నెల 22న రానున్న 'అఖిల్' సినిమా ద్వారా అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులోనూ ఓ స్టార్ హీరో త‌ళుక్కున మెర‌వ‌నున్నాడు. అత‌ను మ‌రెవ‌రో కాదు అఖిల్ తండ్రి, కింగ్ నాగార్జున‌. 'అక్కినేని అక్కినేని' పాట‌లో చైతుతో పాటు నాగ్ కూడా మెరుపులా మెర‌వ‌నున్నారు. త‌న‌యులను స‌పోర్ట్ చేస్తూ స్టార్ హీరోలు వారం గ్యాప్‌లో సంద‌డి చేయ‌నున్న ఈ సినిమాలు ఏ మేర‌కు అభిమానుల‌ను అల‌రిస్తాయో చూడాలి.

More News

'ఊపిరి'లో ఎవరి పాత్రలు ఏమిటంటే..

'బృందావనం', 'ఎవడు' చిత్రాల విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ దర్శకుడు తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కిస్తున్నారు. తెలుగులో 'ఊపిరి'గా, తమిళంలో 'తోళా' గా ఈ సినిమా రూపొందుతోంది.

బన్ని , బోయపాటిల ప్రయత్నం ఫలించేనా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సరైనోడు.ఈ చిత్రంలో బన్ని సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

బాలకృష్ణ చేతులమీదుగా 'సతీ తిమ్మమాంబ' ఆడియో విడుదల

శ్రీ వెంకట్,భవ్య శ్రీ ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న చిత్రం సతీ తిమ్మమాంబ.

చరణ్ కి విలన్ ఇతనే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా తర్వాత తమిళ్ సినిమా తని ఒరువన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

4 ఏళ్ల తరువాత విక్రమ్ డబుల్ ధమాకా

సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ..తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న తమిళ కథానాయకుడు విక్రమ్.తెలుగులోనూ తనకంటూ ఓ మార్కెట్ ని సొంతం చేసుకున్న విక్రమ్ ఈ ఏడాది ఆరంభంలో 'ఐ'సినిమాతో పలకరించాడు.