డిసెంబర్ 27న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' విడుదల

  • IndiaGlitz, [Sunday,December 08 2019]

రాహుల్ మూవీ మేకర్స్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. జీవిత రాజశేజర్ దంపతులు, మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు...

ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ... స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా మెసేజ్ తో కూడిన చిత్రం. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి ఫ్యాషన్ తో ఈ సినిమాను నిర్మించాడు. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాగున్నాయి. నటీనటులందరు బాగా నటించారు, ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. యాజమాన్య అందించిన సంగీతం బాగుంది. రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసిన కరుణ కుమార్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కథ బలం ఉన్న సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటాయి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో కథ తో పాటు సందేశం ఉంది కావున ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తు సెలవు తీసుకుంటున్న అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ... చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం మన పిల్లల్ని ఏ స్కూల్ లో వదలాలి ఆలోచిస్తాం. అలా మనం మన పిల్లలకు మంచి భవిషత్తు ఇవ్వాలని తాపత్రేయ పడతాం, సూట్డెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో స్టూడెంట్స్ గురించి ఒక మంచి మెసేజ్ ఉంది, ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా ఇది. డైరెక్టర్, నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది, అలాగే ఈ మూవీలో నటించిన కొత్త ఆర్టిస్ట్స్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి, సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ... నా మిత్రుడు ఓబుల్ సుబ్బారెడ్డి సినిమాపైన ఆసక్తితో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాను నిర్మించాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక పాయింట్ ను తీసుకొని ఈ సినిమా తీసాడు దర్శకుడు కరుణ కుమార్. నేను మూవీ చూశాను, నచ్చింది, అందుచేత ఈ చిత్రాన్ని నేనే స్వయంగా విడుదల చేయడానికి ముందుకు వచ్చాను. కచ్చితంగా ఈ సినిమా ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాను అన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... మంచి సందేశం ఉన్న కథతో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తీయ్యడం జరిగింది. నేను తెలుగులో తీసున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ కరుణ కుమార్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. హీరో శ్రీనాధ్ మాగంటి బాగా నటించాడు. హరిప్రసాద్ గారు మాకు మంచి కథను అందించారు. అన్న మల్కాపురం శివకుమార్ ఈ సినిమా చూసి ఫాన్సీ రేటుకు సినిమా కోనడం మరింత ఎనర్జీ ఇచ్చింది. డబ్బు వస్తుందా లేదా అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న తృప్తి ఉందన్నారు.

డైరెక్టర్‌ కరుణ కుమార్‌ మాట్లాడుతూ... నా నిర్మాత ఓబుల్‌ సుబ్బారెడ్డి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నా మిత్రుడు హరి ప్రసాద్‌ చక్కటి మెసేజ్‌ ఉన్న కథను అందించాడు. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పారు. డిసెంబర్ 27న విడుదల కాబోతున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ పాయింట్‌ అందరికీ తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది' అని తెలిపారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ బాగుంది. ఇప్పుడే ట్రైలర్, సాంగ్స్ చూశాను మేకింగ్ బాగుంది. యువతకు సందేశం ఇచ్చే సినిమా ఇది. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి, డైరెక్టర్ కారుణ కుమార్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్న అలాగే ఈ మూవీలో నటించిన హీరో హీరోయిన్స్ కు మంచి పేరు వచ్చి వారు బిజీ ఆర్టిస్ట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు: సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ

More News

సీఎం జగన్ సీరియస్.. ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా!?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో కలకలం రేగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో భూకంపం సృష్టిస్తున్నాయి.

ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్‌‌ను విచారణ జరపాలని సుప్రీంలో పిటిషన్

దిశపై అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు కామాంధుల పాపం పండిన విషయం తెలిసిందే.

'సరిలేరు నీకెవ్వరు' సెకండ్ సాంగ్‌ 'సూర్యుడివో చంద్రుడివో'

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై

ఏపీ ప్రజలకు షాక్.. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయ్!

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో కూడా త్వరలోనే పెరుగుతాయని అప్పట్లో పుకార్లు వచ్చాయ్..

నేను పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు: నిత్యానంద

స్వయం ప్రకటిత దేవుడు, రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న స్వామి నిత్యానంద కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే.