టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటించిన సుబ్బరామిరెడ్డి

  • IndiaGlitz, [Thursday,April 06 2017]

2015-16 సంవ‌త్స‌రానికిగానూ టీఎస్సార్ - టీవీ9 నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డుల‌ను గురువారం ఉద‌యం హైద‌రాబాద్‌లో ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా..టి.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ ''అవార్డుల ప్ర‌క‌టిన 30 రోజ‌లు స‌మ‌యం తీసుకున్నాం. అందులో భాగంగా 2015-16కుగానూ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తున్నాం. ఇందులో ప్రేక్ష‌కులు ఎంపిక చేసిన అవార్డులు, క‌మిటీ స‌భ్యులు ఎంపిక చేసే అవార్డులు ఉంటాయి.

ఈ అవార్డుల వేడుక‌ను వైజాగ్‌లో ఒకే వేదిక‌పై యాబై వేల మంది వీక్షించేలా స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుక ఈ నెల 8న వైజాగ్‌లో జ‌ర‌గ‌నుంది. టీవీ9తో పాటు మిగిలిన అన్ని ఛానెళ్ల‌కు కూడా అర‌గంట తేడాతో మా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నాం'' అని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో పింకిరెడ్డి బి.గోపాల్‌, ర‌ఘురామ కృష్ణంరాజు, టీవీ9 విక్ర‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

'ఖయ్యూం భాయ్' టీజర్ ఆవిష్కరణ

గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా `ఖయ్యూం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఎన్టీఆర్ చిత్రంలో విలన్ కన్నడ స్టార్

జనతా గ్యారేజ్ సూపర్సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం `జై లవకుశ`. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి.

డార్జిలింగ్ కు రాజా..రవితేజ

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్న టచ్ చేసి చూడు ఒక చిత్రం కాగా, మరో చిత్రంగా దిల్రాజు నిర్మాతగా అనిరావి పూడి దర్శకత్వంలో రూపొందుతోన్న రాజా ది గ్రేట్.

రాజశేఖర్ 'పి.ఎస్.వి.గరుడవేగ' లో సన్నిలియోన్

అంకుశం,అగ్రహం,మగాడు వంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్ గా వెండితెర పై ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించిన డా.రాజశేఖర్

ఇక్కడ సెన్సార్ చేయని సినిమాకి..అక్కడ ఒక్క కట్ లేకుండా సెన్సార్ అయ్యింది

నవకళ వారి శ్రీ శ్రీమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శశాంక మౌళి, మమతా రాహుత్, పావని హీరో హీరోయిన్లుగా శ్రీను విజ్జగిరి, ప్రసాద్కుమార్ నిర్మాతలుగా రత్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కత్రినా కరీనా మధ్యలో కమల్హాసన్'.