స్వీట్ షాక్ : క్రేజీ డైరెక్టర్ తో హీరోయిన్ పెళ్లి.. అంతా సడెన్ గా..

  • IndiaGlitz, [Friday,June 04 2021]

హీరోయిన్ యామి గౌతమ్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. క్రేజీ డైరెక్టర్ తో ఆమె పెళ్లి గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. వివాహం పూర్తయ్యాక యామి గౌతమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.

ఇదీ చదవండి: నన్ను దూరం పెడుతున్నావా అని బాలుగారు కోపంగా అన్నారు : చిరంజీవి

ఇంతకీ యామి గౌతమ్ పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా ? 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో దేశం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ఆదిత్య ధార్ ని. ఈ సందర్భంగా ఆదిత్యతో కలసి పెళ్లి దుస్తుల్లో సాంప్రదాయ బద్దంగా ఉన్న అందమైన ఫోటోని యామి గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో కేవలం సన్నిహితుల సమక్షంలోనే ప్రైవేట్ గా మా వివాహం జరిగింది. మా ప్రేమ ప్రయాణం మొదలయింది.. మీ అందరి ఆశీర్వాదం కావాలి' అని యామి గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా యామి, ఆదిత్యల వివాహం జరిగింది.

ఉరి చిత్రంతో ఆదిత్య ధార్ ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2016లో ఇండియా పాక్ ఉగ్ర స్థావరాలపై చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఉరి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో యామి గౌతమ్ కూడా కీలక పాత్రలో నటించింది.

ఆ సమయంలోనే మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇలా పెళ్లి చేసుకుని అందమైన జీవితాన్ని ప్రారంభించారు. యామి గౌతమ్ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి చిత్రాల్లో యామి మెరిసిన సంగతి తెలిసిందే. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ యామి గౌతమ్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

More News

నన్ను దూరం పెడుతున్నావా అని బాలుగారు కోపంగా అన్నారు : చిరంజీవి

గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. గత ఏడాది ఆయన మరణించిన సంగతి తెలిసిందే.

శృంగార వీడియో వైరల్.. పోలీసులని ఆశ్రయించిన నటి

గత కొన్ని రోజులుగా సామజిక మాధ్యమాల్లో ఓ అశ్లీల వీడియో వైరల్ గా మారింది.

పీటల మీద పెళ్లి ఆగిపోతే.. ఫ్రస్ట్రేషన్ లో 'ఏక్ మినీ కథ' హీరో!

ప్రస్తుతం యువ హీరో సంతోష్ శోభన్ పేరు బాగా వినిపిస్తోంది. బోల్డ్ అండ్ డిఫెరెంట్ కంటెంట్ 'ఏక్ మినీ కథ'తో మాయ చేశాడు.

బ్రేకింగ్ : టిఆర్ఎస్ కు ఈటెల రాజేందర్ రాజీనామా.. సంచలన కామెంట్స్!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈటెల రాజేందర్ వ్యవహారం నేటితో కొత్త మలుపు చోటు చేసుకుంది.

ఏపీలో డేంజర్ బెల్స్: 2 వారాల్లో 24 వేల మంది పిల్లలకు కరోనా!

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. చిన్న పిల్లల విషయంలో కొత్త భయాందోళన మొదలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.