యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ 'వి'.. సుధీర్‌బాబు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,January 27 2020]

నేచుర‌ల్ స్టార్ నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'వి'. తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నారు. అలాగే సుధీర్‌బాబుతో 'స‌మ్మోహ‌నం' వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ను ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టిస్తున్నారు. నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలువ‌నున్నాయి.

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. సోమ‌వారం సుధీర్‌బాబు లుక్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం నేచుర‌ల్‌స్టార్ నాని లుక్‌ను విడుద‌ల చేయ‌నుంది. నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్ర‌మిది. ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి25న విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి త‌దిత‌రులు

More News

'83' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవ‌త్స‌రం భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విజ‌యం అంత సుల‌భంగా ద‌క్క‌లేదు.

రామోజీ రావుపై ఆగ్రహంతో ఊగిపోయిన బొత్స

2019 ఎన్నికల అనంతరం అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఈనాడు’,‘ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.

గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తెలుగు రాష్ట్రాల శకటాలు!

యావత్ భారత్ దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని రాజ్పథ్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్జాతీయ జెండాను ఆవిష్కరించి..

రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

భారతదేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ అమరావతిలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఈ వేడుకలను జనసేన ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జనసేన

'ఓ పిట్టక‌థ‌' టైటిల్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన త్రివిక్ర‌మ్‌

కొన్ని క‌థ‌లు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. అతి త‌క్కువ నిడివితో  పెద్ద పెద్ద విష‌యాల‌ను చెబుతుంటాయి. అందుకేనేమో అలాంటి వాటిని పిట్టక‌థ‌లు అంటుంటారు. అలాంటి ఓ ఇంట్ర‌స్టింగ్ పిట్టక‌థ‌ను