బెల్లంకొండతో సుధీర్ వర్మ?

స్వామిరారా, కేశ‌వ వంటి థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌. ఈ ద‌ర్శ‌కుడు శ‌ర్వానంద్‌తో ర‌ణ‌రంగం సినిమాను డైరెక్ట్ చేసిన త‌ర్వాత మ‌రో సినిమాను డైరెక్ట్ చేయ‌లేదు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో సుధీర్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని టాక్‌. రాక్ష‌సుడు సినిమా స‌క్సెస్ త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో న‌భా న‌టేశ్‌, అను ఇమ్మాన్యుయేల్, సోనూ సూద్ ఇత‌ర తారాగ‌ణంగా నటిస్తున్నారు.

కాగా.. ఈ సినిమా త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోందని టాక్‌. త‌న‌దైన స్ల‌యిల్లో సుధీర్ వ‌ర్మ ఈ చిత్రాన్ని థ్రిల్ల‌ర్ పంథాలోనే తెర‌కెక్కించనున్నాడ‌ట‌. ఈ సినిమాకు ముందుకు సుధీర్ వ‌ర్మ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ఓ కొరియ‌న్ రీమేక్ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ని, విక్ర‌మ్ వేద సినిమాను రీమేక్ చేస్తాడ‌ని.. ఇలా ప‌లు వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు బెల్లంకొండ‌తో సుధీర్ సినిమా కూడా అలాంటిదేనా? నిజా నిజాలేంటి అనే విష‌యాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

రెండు తెలుగు సినిమాల్లో హాసిని!!

బాలీవుడ్ భామ జెనీలియా తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

ఒక్కరోజే తమిళనాడులో 743.. మహారాష్ట్రలో 2,250 కరోనా కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రోజురోజుకు విజృంభిస్తోంది.

వామ్మో.. ఈ నర్స్ మేడమ్ టూ హాట్ గురూ..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్స్, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అలుపెరగని పోరాటం చేస్తు్న్నారు.

చిత్ర ప‌రిశ్ర‌మ కోసం మెగా మీటింగ్‌

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌లు రంగాల్లో సినీ పరిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది.

తెలంగాణలో ఇవాళ్టికి సేఫ్.. కొత్తగా 27 కేసులు!

తెలంగాణలో గత కొన్నిరోజులుగా చూస్తే కాస్త తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ్టికి సేఫ్‌ జోన్‌లోనే ఉన్నట్లే.