ముస్తాబవుతున్న సుకుమార్ దర్శకుడు

  • IndiaGlitz, [Sunday,June 25 2017]

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవల ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది.సాయికార్తీక్ అందించిన పాటలను ఒక్కొక్కటి విడుదల చేసి.. ఆ తర్వాత పూర్తి ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
అశోక్ నటన, హరి ప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.

More News

'బాహుబలి' విషయంలో నేను హార్ట్ అయ్యాను - శ్రీదేవి

శ్రీదేవి ఎనిమిది కోట్లు రెమ్యునరేషన్ అడిగారు. హిందీ వెర్షన్లో భాగం కావాలని కూడా అడిగారు. షూటింగ్కు వస్తే స్టార్ హోటల్ కావాలని, పది ఫ్లైట్ టికెట్స్ కావాలన్నారు.

ప్రభుదేవా కొత్త షేడ్..

కొరియోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభుదేవా తర్వాత డ్యాన్స్ మాస్టర్గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. అన్నింట్లో సక్సెస్ అయిన ప్రభుదేవా ఇప్పుడు రూట్ మార్చి విలన్గా నటించబోతున్నాడని సమాచారం.

విలన్ గా నాని

వరుస విజయాలను సాధిస్తున్న యువక కథానాయకుడు నాని. ఇప్పుడు `నిన్ను కోరి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా సినిమా రూపొందిన ఈ సినిమా జూలై 14న విడుదల కానుంది.

'మెంటల్ మదిలో' చిత్రంలోని అరవింద్ కృష్ణ పాత్ర పరిచయం

ప్రపంచ సినిమా స్థాయిలో ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమ ఎదుగుతోంది. నిర్మాణం పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు నేటివిటీతో ప్రపంచస్థాయి సినిమాలు తీయవచ్చని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకొంటున్నారు.

జూన్ 30న గంటా రవి, జయంత్ సి.పరాన్జీల 'జయదేవ్'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం 'జయదేవ్'.