'జీ 5' ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుద‌ల కానున్న‌ సుమంత్ 'మళ్ళీ మొదలైంది'

  • IndiaGlitz, [Friday,January 21 2022]

'జీ 5' ఓటీటీ లక్ష్యం ఒక్కటే... వీక్షకులకు వినోదం అందించడమే. అది కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా... ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డమే లక్ష్యంగా 'జీ 5' ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తోంది. లేటెస్టుగా మరో సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది.

సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మళ్ళీ మొదలైంది'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను 'జీ 5' ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా 'మళ్ళీ మొదలైంది'. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన 'ఎలోన్ ఎలోన్'కు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో.

'జీ 5' ఓటీటీలో ఈ నెల 21న 'లూజర్' సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మళ్ళీ మొదలైంది'తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

More News

'శేఖర్' నుంచి సెకండ్ సింగిల్ రెడీ.. పోస్టర్‌లో ఏం చెప్పారంటే..?

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 91వ చిత్రం శేఖర్. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు.

మద్యం మత్తులో కారుతో బీభత్సం.. దాసరి కుమారుడు అరుణ్‌పై కేసు

దిగ్గజ సినీ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్‌పై పోలీస్ కేసు నమోదైంది.

సింగర్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు.. కట్టలు తెంచుకున్న అభిమానం

భారతదేశంలో సినీనటులు, కళాకారులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిని దైవంలా పూజిస్తూ వుంటారు అభిమానులు.

గర్భవతిగా.. పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ వ్యాయామాలు

టాలీవుడ్ అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి ఇటీవల కాజల్ దంపతులు తెరదించారు.

మీ శ్రద్ధకు కృతజ్ఞుడిని... సీఎం జగన్‌కు కైకాల సత్యనారాయణ లేఖ

అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకున్నారు.