విశాల్ కు సమన్లు జారీ

  • IndiaGlitz, [Wednesday,October 25 2017]

రెండు రోజుల క్రితం జీఎస్టీ అధికారులు విశాల్ ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయం లో విశాల్‌ కార్యాలయం నుంచి కొన్ని కీలక ఆధారాలను అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది. తనిఖీల్లో విశాల్‌ రూ. 51 లక్షల పన్ను చెల్లించలేదని తేలినట్లు సమాచారం.

అయితే ఈ విషయమై రేపు అంటే 27వ తేదీన తమ కార్యాలయంలో హాజరు కావాలంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు విశాల్ కు సమన్లు జారీ చేసినట్లు తెలిసింది.

విశాల్‌ మాత్రం తన ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయన్నారు. ఒకవేళ తనపై కక్ష సాధింపుచర్యలకు పాల్పడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

విశాల్‌ మెర్శల్‌ చిత్రానికి మద్దతు తెలపడం వల్లే ఆయన కార్యాలయంపై దాడులు జరిగాయంటున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు.

తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మరియు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి అయిన విశాల్, తన సొంత సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో ఇప్పటివరకు ఆరు చిత్రాలు నిర్మించారు.

More News

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సమరం

యూనివర్సల్ ఫిలిమ్స్ బ్యానర్ పై జి వి ఎస్ నిర్మాణంలో బషీర్ ఆలూరి దర్శకుడుగా సాగర్, ప్రగ్యా హీరో హీరోయిన్స్ గా, సుమన్, వినోదకుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం సమరం.

2.0 ఆడియో వేడుక - ఎలా చేస్తున్నారో తెలిస్తే షాక్

రజనీకాంత్ -అక్షయ్కుమార్-శంకర్ కాంబినేషన్ లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపు దిద్దుకుంటున్న చిత్రం 2.0. ఎమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఆచారి అమెరికా యాత్ర భారీ షెడ్యూల్ పూర్తి

విష్ణు మంచు, ప్రగ్య జైస్వాల్, బ్రహ్మానందం ముఖ్య తారాగణం గా వస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం అమెరికాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొంది.

పాప‌కు జ‌న్మ‌నిచ్చిన అసిన్‌...

గ‌జిని ఫేమ్ అసిన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో సంజ‌య్ రామ‌స్వామి ల‌వ‌ర్‌గా అసిన్ చేసిన పాత్ర అందరికీ గుర్తుండి పోతుంది. ఆ సినిమాలో అసిన్ పాత్ర‌ధారికి సంజ‌య్ రామ‌స్వామి అనే సెల్ ఫోన్ ఓన‌ర్‌ని ప్రేమిస్తుంది.

అందులోనూ ప‌వ‌నే ఫ‌స్ట్‌....

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా అభిమానులు ప‌వన్ సొంతం. హీరోల అభిమానుల మ‌ధ్య కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది.