మే మొదటి వారంలో ఆడియో, చివరి వారంలో సునీల్ నటించిన 'ఉంగరాల రాంబాబు' విడుదల

  • IndiaGlitz, [Saturday,April 29 2017]

'జ‌క్క‌న్న' తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొన్న‌ సునీల్ హీరోగా.... ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల‌తో విమర్శకుల ప్రశంసలందుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి.... యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్నారు. సునీల్ సరసన అందాల భామ మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. మే మొదటి వారంలో జిబ్రాన్ సంగీతమందించిన ఆడియోని విడుద‌ల చేసి... మే చివరి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కిస్తున్న ఉంగ‌రాల రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తయింది. సునీల్ నుంచి ఆశించే వంద శాతం కామెడీ ఇందులో చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు క్రాంతి మాధవ్ హిలేరియస్ కామెడీ సన్నివేశాలతో కథను అద్భుతంగా చెప్పారు. న‌వ్వించ‌మే ద్యేయంగా... అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోనే కామెడీని పొందు ప‌రిచి న‌వ్విస్తాం. ప్రకాష్ రాజ్ గారి పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. హీరోయిన్ మియా జార్జ్ మరో ప్లస్ పాయింట్. పాటలు చాలా బాగా వచ్చాయి. ఆడియో సూపర్ హిట్ కావడం గ్యారంటీ. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌కాష్‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. మే మొదటి వారంలో జిబ్రాన్ సంగీతమదించిన ఆడియో రిలీజ్ చేయనున్నాం. మే చివరి వారంలో సమ్మర్ కానుకగా చల్లని వినోదాల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.'' అని అన్నారు.

More News

షూటింగ్ పూర్తి చేసుకోనున్న 'ఒక్కడు మిగిలాడు'

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'.

రూమర్స్ పై తమన్నా క్లారిటీ...

మిల్కిబ్యూటీ తమన్నా బాహుబలి చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

మహేష్ అభినందనల పై కామెంట్స్...

సూపర్ స్టార్ మహేష్ కళాతపస్వి కె.విశ్వనాథ్ కు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సందర్భంగా

భూటాన్ లో జక్కన్న...

ఐదేళ్ళ ప్రయాణం ఏప్రిల్ 28న 'బాహుబలి 2' విడుదలతో పూర్తయ్యింది.సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రక్షకభటుడు'

సుఖీభవ మూవీస్ పతాకంపై ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎ.గురురాజ్ నిర్మాత గా రూపొందుతోన్న