Guntur Kaaram: గ్లింప్స్‌తో మాస్ ట్రీట్ ఇచ్చిన సూపర్‌స్టార్ మహేశ్ - త్రివిక్రమ్ 'గుంటూరు కారం'

  • IndiaGlitz, [Wednesday,May 31 2023]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. వరుస విజయాలతో మంచి జోష్‌లో వున్న వీరిద్దరూ దాదాపు పుష్కర కాలం తర్వాత ఒకే సినిమా కోసం పనిచేస్తున్నారు. #SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం సూపర్‌స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్, గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

మిర్చి యార్డులో బీడీ కాల్చుకుంటూ స్టైల్‌గా మహేశ్:

గ్లింప్స్ విషయానికి వస్తే.. గుంటూరు మిర్చి యార్డులో బీడీ కాల్చుకుంటూ మహేశ్ నడుచుకుంటూ వస్తాడు. విలన్ గ్యాంగ్‌ను కుమ్మేస్తూ వుంటాడు. ఈ సందర్భంగా ‘‘ ఏంటీ అట్టా చూస్తాండవు.. బీడీ ఏమైనా త్రీడీలో కనబడతందా’’ అంటూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి థియేటర్లు దద్దరిల్లాల్సిందే. మహేశ్- త్రివిక్రమ్ మూవీకి తొలి నుంచి గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు అనే టైటిల్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చివరికి ‘గుంటూరు కారం’కు మేకర్స్ జై కొట్టారు.

సంక్రాంతి కానుకగా గుంటూరు కారం:

ఇకపోతే.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీలీల మరో కథానాయికగా నటిస్తుండగా థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న గుంటూరు కారంని విడుదల చేస్తామని ఇప్పటికే మేక్రస్ ప్రకటించారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ జూన్ 5 నుంచి ప్రారంభంకానున్నట్లు ఫిలింనగర్ టాక్. దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరగనుంది.

More News

The Constable: 'ది కానిస్టేబుల్'గా వస్తున్న వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న "ది కానిస్టేబుల్" చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో జరిగాయి.

మృతదేహంపై కూర్చొని అఘోరా పూజలు.. అవాక్కయిన జనం, ఎక్కడంటే..?

అఘోరాలు.. వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలో వీరికి ప్రత్యేక స్థానం, గుర్తింపు వుంది. కుటుంబాన్ని , సంసార బాధ్యతలను వదిలేసి పరమేశ్వరుడి సేవకే వీరు జీవితాన్ని అంకితం చేస్తారు.

Pushpa 2: పుష్ప 2 యూనిట్‌తో వస్తున్న బస్సుకు ప్రమాదం.. ఆర్టిస్టులకు గాయాలు

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్‌ ప్రజలను విశేషంగా అలరించాయి.

అల్లు అర్జున్ ఏషియన్ సత్యం థియేటర్ ఓపెనింగ్ డేట్స్ ఫిక్స్.. శ్రీరాముడి ఆశీర్వాదాలతోనే..?

తమ ముందు తరాల వారిని చూశారో.. లేక వ్యక్తిగత అనుభవమో కానీ ప్రస్తుతం సినీ పరిశ్రమలో వున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

Avinash Reddy:అవినాష్ రెడ్డికి ఉపశమనం .. పచ్చ మీడియా కడుపు మంట, లైవ్ డిబేట్‌లో ఏకంగా జడ్జిలపైనే ఆరోపణలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.