తేల్చి చెప్పేసిన రజనీకాంత్.. మక్కల్ మండ్రం రద్దు!

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ వస్తున్న ఊహాగానాలపై కుండబద్దలు కొట్టేశారు. సోమవారం రోజు రజనీకాంత్ పోయెస్ గార్డెన్ లోని తన నివాసంలో అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి రావడం లేదనే విషయాన్ని అభిమానులకు తేల్చి చెప్పేశారు.

గతంలోనే రజని ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తిరిగి రజని రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపించాయి. దీనితో అభిమానుల్లో అసలు రజని రాజకీయాల్లోకి వస్తారా రారా అనే గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సోమవారం పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. గతంలో రజని రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆరోగ్య కారణాల రీత్యా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.

రజనీకాంత్ సోమవారం చెన్నైలో తన అభిమానులు, మక్కల్ మండ్రం నిర్వాహకులతో సమావేశం అయ్యారు. భవిషత్తులో నేను రాజకీయాల్లోకి వస్తానా రానా అని అభిమానులు అడుగుతున్నారు. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. మక్కల్ మండ్రంని కూడా రద్దు చేస్తున్నట్లు రజని ప్రకటించారు. దానిని రజని అభిమాన సంక్షేమ మండ్రంగా మార్చుతున్నట్లు తెలిపారు.

ఇటీవల సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లి వచ్చానని రజని అన్నారు. కరోనా పరిస్థితులు, షూటింగ్స్ బిజీ వల్ల కొంత కాలంగా అభిమానులని సరిగ్గా కలుసుకోలేదు. అందుకే ఈ రోజు వారితో సమావేశం అయ్యానని రజని అన్నారు. ఈ సమావేశంతో తన విషయంలో రాజకీయ ప్రస్తావన రాకుండా రజని క్లారిటీ ఇచ్చేశారు.

రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' చిత్రంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

More News

Roar of RRR: సంస్కృత రాపర్ ని రంగంలోకి దించిన కీరవాణి!

షూటింగ్ పూర్తి కావస్తుండడంతో దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలని షురూ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం కొన్ని నెలల టైం పడుతుంది.

హిందీలో 'జనతా గ్యారేజ్' రీమేక్.. కన్నేసిన స్టార్ హీరో

సౌత్ చిత్రాలకు ప్రస్తుతం నార్త్ లో డిమాండ్ ఎక్కువ. బాలీవుడ్ హీరోలు తెలుగు, తమిళ కథలపై మోజు పెంచుకుంటున్నారు. ఇక్కడ ఘనవిజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్ లో వరుసగా రీమేక్ అవుతున్న

'రామారావు' గా డ్యూటీలో రవితేజ.. స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్

మాస్ మహారాజ్ రవితేజ 68వ చిత్రం శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా

శిరీష బండ్ల స్పేస్ సూట్ పై ఇండియన్ ఫ్లాగ్.. అతడికి కూడా ఇండియాతో..

తెలుగు వనిత శిరీష బండ్ల చరిత్ర సృష్టించింది. విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించిన మూడో భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు కల్పన చావ్లా, సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్లారు.

బాబోయ్.. ఏంటి అఖిల్ జోరు.. 'ఏజెంట్' గా కిల్లింగ్ సిక్స్ ప్యాక్ లుక్

యంగ్ హీరో అఖిల్ అక్కినేని గత కొన్నిరోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాడు. అఖిల్ నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక అఖిల్ తదుపరి క్రేజీ డైరెక్టర్