జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్

  • IndiaGlitz, [Friday,May 14 2021]

కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిన అనంతరం కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌కు షిఫ్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. చదువులు, సమావేశాలు, ఆఫీస్ వర్క్ అన్నీ ఆన్‌లైన్‌లో నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సైతం వర్చువల్ విధానంలో విచారణలు నిర్వహిస్తోంది. కాగా.. జర్నలిస్టుల కోసం తాజాగా ఓ ప్రత్యేక యాప్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రారంభించారు. యాప్‌ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ.. జస్టిస్‌ కన్విల్‌కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ధనుంజయ్‌ల కమిటీ ఈ యాప్‌నకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు సాంకేతిక బృందం దీన్ని రూపొందించినట్లు ఎన్‌వీ రమణ వెల్లడించారు.

Also Read: అరేబియాలో సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. తుపాను అలర్ట్‌

సుప్రీంకోర్టు రోజువారీ కార్యకలాపాలను జర్నలిస్టులు ఇకపై ఉన్న చోటు నుంచే రిపోర్ట్‌ చేసేందుకు ఈ అవకాశం కల్పించామన్నారు. కోర్టులో జరిగే కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేందుకుగాను సాంకేతికంగా ముందుకెళ్లాలని భావించినట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. గతంలోను ఓ జర్నలిస్టుగా బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు. సుప్రీంకోర్టు విచారణలను జర్నలిస్టులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు ఇ-కమిటీ చొరవతో ఈ యాప్‌ని విడుదలు చేస్తున్నామని ఎన్.వి రమణ తెలిపారు.

కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. కోర్టు ప్రత్యక్ష కార్యకలాపాలను ప్రసారం చేసేలా ఓ ట్రయల్‌ ప్రతిపాదనను కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తోందన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కోర్టు విచారణలను పలువురు జర్నలిస్టులు వర్చువల్‌ ద్వారా జరపాలని కోరిన తరువాత యాప్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ఈ యాప్‌ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ ద్వారా విచారణలను ప్రత్యక్షంగా హాజరయ్యే వీలు కల్పించనున్నారు. కాగా.. కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఇతర న్యాయమూర్తులు సంతాపం తెలిపారు.

More News

అరేబియాలో సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. తుపాను అలర్ట్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 16, 17 తేదీల్లో తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైకోర్టు చెప్పినా వినరా? అంబులెన్స్‌లను అడ్డుకున్న పోలీసులు.. 

ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో పేచీ మళ్లీ మొదటికి వచ్చింది. అంబులెన్స్‌లను ఆపడం మానవత్వమేనా?

ఆ తల్లి ఆవేదనకు కన్నీళ్లు పెడుతున్న నెటిజన్లు

పిల్లలు ఎటు వెళ్లొచ్చినా.. ఇంటికి రాగానే అమ్మ కోసమే వెదుక్కుంటారు. పెద్దవాళ్లైన తర్వాత కూడా దీనిలో మార్పైతే ఏమీ ఉండదు.

కరోనా నుంచి కోలుకున్నవారు టీకా కోసం 6 నెలలు ఆగాల్సిందే..

ప్రస్తుతం భారత్‌లో రెండు రకాల టీకాలను ప్రజలకు ఇస్తున్న విషయం తెలిసిందే. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ప్రజానీకానికి అందజేస్తోంది.

టీఎన్నార్ కుటుంబానికి డైరెక్టర్ మారుతి సాయం

ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్ట్‌, నటుడు టీఎన్నార్‌ కుటుంబ సభ్యులను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి సాయం అందజేస్తున్నారు.