close
Choose your channels

ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్‌‌ను విచారణ జరపాలని సుప్రీంలో పిటిషన్

Saturday, December 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్‌‌ను విచారణ జరపాలని సుప్రీంలో పిటిషన్

దిశపై అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు కామాంధుల పాపం పండిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున నిందితుల పారిపోతుండగా పోలీసులు వారిని కాల్చిచంపారు. దీంతో ఈ ఘటనపై యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకు దీన్ని సమర్థిస్తున్నారు. మరోవైపు తమదైన శైలిలో మీడియా, సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. అయితే నాడు వరంగల్ యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్.. ఇటీవల దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన రెండూ కూడా సీపీ సజ్జనార్ నేతృత్వంలోనే జరిగాయి. అయితే అప్పట్లో వరంగల్ ఎస్పీగా ఉన్నారు.. ఇప్పుడు సైబరాబాద్ సీపీగా ఉన్నారంతే.. మిగతాదంతా సేమ్‌ టూ సేమ్!

అందర్నీ విచారించండి!
అయితే.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను మాత్రం కొద్దిమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులతో పాటు సీపీ సజ్జనార్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జీఎస్‌ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు పిటిషన్లు దాఖలు చేశారు. దిశ అత్యాచారం, హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ ద్వారా హతమార్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ వేసిన ఆ ఇద్దరూ లాయర్లే.! నిందితులు నేరారోపణ ఎదుర్కొంటున్నప్పటికీ వారికి జీవించే హక్కుంటుందని లాజిక్‌ను లాయర్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులతో పాటు సీపీ సజ్జనార్‌పై విచారణ జరపాలని పిటిషనర్లు కోరారు. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సీజే ఎస్ఏ బాబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు!
శనివారం నాడు సీజే ఎస్ఏ బాబ్డే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్వర న్యాయం అనేది సరికాదని.. జస్టిస్ అనేది ప్రతీకారం రూపంలో ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. అలా జరిగితే న్యాయం రూపు రేఖలు కోల్పోతుందన్నారు. రాజస్థాన్‌ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. మరి తాజా పిటిషన్‌ సీజే ఎలా రియాక్ట్ అవుతారో..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.