అభిమానులకు సుప్రీమ్ పాటను చూపించిన సాయి ధరమ్ తేజ్ - దిల్ రాజు

  • IndiaGlitz, [Sunday,May 01 2016]

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపిందిన చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 5 న భారీ విడుదలకు సిద్ధపడుతోంది.

జంగారెడ్డి గూడెం లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని, ఆ తరువాత రాజేశ్వరి ధియేటర్ లో ఫాన్స్ ను కలుసుకున్న సుప్రీమ్ యూనిట్, అక్కడ స్పెషల్ గా 'టాక్సీ వాలా' పాటను ప్రదర్శించారు. తమ కోసం ప్రత్యేకం గా రిలీజ్ కి ముందే ఇలా పాటను ప్రదర్శించటం తో, ఫాన్స్ ఎంతో ఆనందం తో యూనిట్ కు బ్రహ్మరధం పట్టారు. సాయి ధరమ్ తేజ్ వేసిన స్టెప్స్ చూసి బాగా ఎంజాయ్ చేసారు.

సుప్రీమ్ మే 5 న భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తో సాయి ధరమ్ తేజ్ చేస్తోన్న మూడవ చిత్రం ఇది.

"సుప్రీమ్ అందరినీ అలరించే ఒక మాస్ ఎంటర్టైనర్.వేసవి సెలవుల్లో కుటుంబ సమేతం గా చూసి ఎంజాయ్ చేసే చిత్రం. మే 5 న భారీ విడుదల చేస్తున్నాం. ఇటీవలే విడుదల చేసిన ఆడియో కు మంచి స్పందన వస్తోంది . సాయి కార్తీక్ అందించిన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి ", అని శిరీష్ అన్నారు.

దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక మాస్ చిత్రం ఇది. ఏక్షన్ , కామెడీ ,రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్ళలో ఉండే చిత్రం ఇది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ అండ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది", అన్నారు.

సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్ , రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు

More News

విక్ర‌మ్ కి తెలుగు హీరోలు క‌న‌ప‌డ‌లేదా..?

చెన్నై వ‌ర‌ద‌ల భీభ‌త్సం ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించింది.  టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం క‌దిలివ‌చ్చి త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాల్ని అందించారు. ముఖ్యంగా  తెలుగు యువ‌ క‌థానాయ‌కులు అంతా క‌ల‌సి ఒక టీమ్ గా ఏర్ప‌డి చెన్నై కోసం ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేసారు.

ఫిలిం మేకర్స్ కంటే ఆడియెన్స్ తెలివైనవాళ్లు - హీరో సూర్య

సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’.

బి.జె.పి కి వార్నింగ్ ఇచ్చిన‌ ప‌వ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ గ‌త కొన్ని రోజులుగా కేంద్రాన్ని అడుగుతున్న‌ప్ప‌టికీ...అదిగో..ఇదిగో అంటుంది కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా పై ఏ విష‌యం చెప్ప‌లేదు.

మే 13న జి.వి.ప్రకాష్ , శ్రీదివ్యల 'పెన్సిల్'

తెలుగు,తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్,మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు,బస్ స్టాప్,కేరింత,

కబాలి టీజర్ రిలీజ్ ఆ రోజే..

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్నచిత్రం కబాలి.