స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేసిన 'వానవిల్లు' లోని సరికొత్త గీతం

  • IndiaGlitz, [Thursday,July 13 2017]

ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా "వానవిల్లు". శ్రావ్య, శ్రీ సయ్యిని హీరోయిన్లు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై లంకా కరుణాకర్ దాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలోని యుగళ గీతాన్ని గీతాన్ని ప్రముఖ దర్శకులు సురేందర్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ - "టైటిల్‌కి తగ్గట్టు ఓ అందమైన వెరైటీ ప్రేమకథ ఇది. అందులో వర్షం ఏం చేసింది? అనేది ఆసక్తికరం. కేరళ, మలేసియాలలో కొంత టాకీ, సాంగ్స్ షూట్ చేశాం. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు మా సినిమాలోని పాటను విడుదల చేయడంతోపాటు.. టేకింగ్ చాలా రిచ్ గా ఉందంటూ మెచ్చుకోవడం మాకు సంతోషాన్నిచ్చింది. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. అనంతరం సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తాం" అన్నారు.

ప్రభాస్ శీను, సత్య, సురేఖావాణి తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పవన్, మ్యూజిక్: ప్రభు ప్రవీణ్, ఫైట్స్‌: నందు, ప్రొడక్షన్‌ మేనేజర్‌: సుబ్బారావు, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: సుభాష్‌, నరేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: జై, మూర్తి, కెమెరామెన్‌: ఎస్‌.డి. జాన్‌, నిర్మాత: లంకా కరుణాకర్‌ దాస్‌, స్క్రీన్‌ప్లే-ఎడిటింగ్‌-దర్శకత్వం: ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌.

More News

ఇప్పుడు హత్య కేసుకు మెడకు చుట్టుకుంది...

మలయాళ నటి భావన కిడ్నాప్,లైంగిక దాడి కేసులో నటుడు దిలీప్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

హిట్ త్రయం మరోసారి...

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్తో సినిమా చేస్తున్న ఎ.ఆర్.మురుగదాస్

హీరో సూర్యకు ఉపశమనం...

హీరో సూర్యకు కోర్టు కేసు నుండి ఊరట లభించింది.

కమల్ ను ఆరెస్ట్ చేయాలి...

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినిమాలే కాకుండా రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ముగ్గురు హీరోలతో రాజమౌళి...ఎవరా ముగ్గురు..!

'బాహుబలి2' తర్వాత రాజమౌళి చెయ్యబోయే సినిమా ఏమిటి అనే ప్రశ్నకు అందరికీ సమాధానం కావాలి.