close
Choose your channels

ఆ పుకార్లకి తెరదించిన సురేందర్ రెడ్డి

Tuesday, February 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి`. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చారిత్రాత్మ‌క‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు త‌మిళ న‌టుడు విజయ్ సేతుపతి, క‌న్న‌డ న‌టుడు కిచ్చా సుదీప్, తెలుగు న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కోలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ ఇందులో నయనతార క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఆ మధ్య ఈ ప్రతిష్టాత్మక వెంచర్ నుంచి డబుల్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా తప్పుకున్నారని మీడియాలో కొన్ని కథనాలు వినిపించాయి. అయితే ఈ పుకార్లకి తెరదించుతూ.. తాజాగా అమితాబ్‌ను క‌లిసిన సంద‌ర్భంగా త‌ను దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. దీంతో అమితాబ్ సైరా` లో నటిస్తున్నారనే విష‌యాన్ని చెప్పకనే చెప్పారు ఈ డైరెక్టర్. ఇందులో నరసింహారెడ్డి పాత్రకి గురువు పాత్రలో అమితాబ్ నటించనున్నట్టు సమాచారం. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23 నుంచి రెండో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.