close
Choose your channels

సినీ కార్మికులకు సురేష్ ప్రొడక్షన్స్ కోటి విరాళం..

Saturday, March 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినీ కార్మికులకు సురేష్ ప్రొడక్షన్స్ కోటి విరాళం..

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే విరాళాలు ప్రకటించారు.

తాజాగా.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ యాజమాన్యమైన దగ్గుబాటి కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు, హీరోలు వెంకటేశ్, రానాలు తాము కోటి రూపాయిలు ఇస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. కాగా.. ఈ సాయాన్ని కార్మికులు, హెల్త్‌వర్కర్ల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. ఇప్పటి వరకూ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున పెద్ద మొత్తంలో అనగా కోటి రూపాయిలు విరాళంగా ప్రకటించారు. అయితే అదే బాటలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా నడిచింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.