సినీ కార్మికులకు సురేష్ ప్రొడక్షన్స్ కోటి విరాళం..

  • IndiaGlitz, [Saturday,March 28 2020]

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ రాజశేఖర్, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే విరాళాలు ప్రకటించారు.

తాజాగా.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ యాజమాన్యమైన దగ్గుబాటి కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు, హీరోలు వెంకటేశ్, రానాలు తాము కోటి రూపాయిలు ఇస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. కాగా.. ఈ సాయాన్ని కార్మికులు, హెల్త్‌వర్కర్ల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. ఇప్పటి వరకూ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున పెద్ద మొత్తంలో అనగా కోటి రూపాయిలు విరాళంగా ప్రకటించారు. అయితే అదే బాటలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా నడిచింది.

More News

స్టార్ హీరో అక్షయ్ 25 కోట్ల భారీ విరాళం

దేశవ్యాప్తంగా కరోనా ముప్పు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ‘పీఎం కేర్స్ ఫండ్’ ఏర్పాటు చేశారు. కరోనాపై పోరుకు, సహాయక చర్యలకు ఉపయోగపడేలా విరాళాలు ఇవ్వదలిచిన వారికి

కోటి రూపాయిలిచ్చి ‘కింగ్’ అనిపించుకున్న నాగ్..

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

చ‌ర‌ణ్ త‌దుప‌రి ద‌ర్శ‌కుడు అత‌నేనా?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ‘రౌద్రం ర‌ణం రుధిరం’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్

రాజ‌మౌళి చిత్రంలో మ‌రో సూపర్ స్టార్ ?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా

తార‌క్ అన్నీ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెబుతాడు..!

‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు ప్ర‌త్యేక కార‌ణాలు చెప్ప‌న‌క్క‌ర్లేదు. ‘బాహుబ‌లి’ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.