పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం: బండి సంజయ్

బీజేపీకి భయపడి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నిన్న మేనిఫెస్టోను విడుదల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతబస్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలను పట్టించుకోని కేసీఆర్‌ మొదటిసారిగా మేనిఫెస్టోను విడుదల చేశారని విమర్శించారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాసులు ఓట్లేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకోగానే... పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని బండి సంజయ్‌ వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మేనిఫెస్టోలో ఏం చెప్పారో, ఇప్పుడు అదే చెప్పారన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులను మరోసారి మోసం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. గ్రేటర్ మహిళల గాజుల శబ్దానికి కేసీఆర్, కేటీఆర్, ఓవైసీ చెవుల నుంచి రక్తం కారాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చి బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

More News

వరద బాధితులకు రూ.50 వేలు: కాంగ్రెస్ మేనిఫెస్టో

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విడుదల చేశారు.

‘ఆచార్య’లో విలన్ ఎవరంటే..?

గ‌త ఏడాది ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి అంత స్కోప్ లేకుండా పోయింది.

తీవ్ర తుపాను‌గా మారిన వాయుగుండం

వాయుగుండం తీవ్ర తుపాను‌గా మారింది. ఈ తుపానుకు నివర్ అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే.

ఏపీపై కేటీఆర్ కామెంట్.. ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ బీజేపీ నేత ఫైర్

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

బాలీవుడ్ స్టార్ట్స్‌ని వెనక్కి నెట్టేసిన సోనూసూద్..

సోనూ సూద్ రీల్ విలన్ కాస్తా.. కరోనా మహమ్మారి దేశంలోకి ఎంటర్ అవగానే రియల్ హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే.